విశాఖ: సీఎం వైయస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రలా సాగుతోంది. ఉత్తరాంధ్రలో దారులన్నీ బస్సు యాత్రవైపుగా అన్నట్లుగా ఉంది.దారులన్నీ వైయస్ జగన్ కోసమే.. కళ్లన్నీ వైయస్ జగన్ మీదనే.. కులం లేదు.. మతం లేదు... ప్రాంతం లేదు .. రాయలసీమ, దక్షణకోస్తా.. ఉభయగోదావరి.. ఉత్తరాంధ్ర... ప్రాంతమేదైనా అదే జనం అదే నినాదం. 58 నెలల సంక్షేమ పాలన అందించిన తమ ప్రియతమ నేతను చూసేందుకు అడుగడుగునా జనం అక్కచెల్లెమ్మలు అందిస్తున్న అపురూపనీరాజనం. గుమ్మడికాయలతో దిష్టి తీసి.. హారతులు పడుతున్న అక్కచెల్లెమ్మలు.