మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్

విశాఖ‌:  వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,  ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేప‌ట్టిన‌ మేమంతా సిద్ధం - 21వ రోజు మంగళవారం (ఏప్రిల్ 23) షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శిల ర‌ఘురాం విడుద‌ల చేశారు. 
మంగ‌ళ‌వారం ఉదయం 9 గంటలకు  ఎండాడ ఎంవీవీ సిటీ రాత్రి బస నుంచి వైయ‌స్ జ‌గ‌న్ బ‌స్సుయాత్ర‌ బయలుదేరి మధురవాడ, మీదుగా ఆనందపురం చేరుకుని చెన్నాస్ కన్వెన్షన్ హాల్ వద్దకు చేరుకుంటుంది. అక్క‌డ‌ సోషల్ మీడియా కార్యకర్తలతో వైయ‌స్ జ‌గ‌న్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొని తగరపువలస మీదుగా జొన్నాడ చేరుకుంటారు. జొన్నాడ దాటిన తర్వాత  భోజన విరామం తీసుకుని  బొద్దవలస మీదుగా సాయంత్రం 3:30 గంటలకు చెల్లూరు వద్ద బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
 అనంతరం చింతలవలస, భోగాపురం, రణస్థలం మీదుగా అక్కివలస రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. 

Back to Top