విశాఖ: ప్రజలందరికీ సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని గాజువాకా ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి తెలిపారు. జగనన్న ఆరోగ్య సురక్షతో ప్రజల వద్దకే వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు. గురువారం కణితి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం లో జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. వడ్లపూడి -1 సచివాలయం పరిధిలోని 250 మందికి, స్పెషలిస్ట్ డాక్టర్స్ పర్యవేక్షణలో వైద్య సేవలు అందజేశారు. ఈ సందర్బంగా తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ.. జగనన్న ఆరోగ్య సురక్ష తో పేద ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలన్న ఆలోచనతో రాష్ట్ర ముజ్యమంత్రి వైయస్ జగన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. 87వ వార్డు ఇంచార్జ్ కోమటి శ్రీనివాస రావు మాట్లాడుతూ.. ప్రతి గడపకు ఉచితంగా వైద్య సేవలు అందజేయడం ద్వారా, ఆరోగ్యాన్ని ప్రజలందరీ హక్కుగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్కే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో మెడికల్ సిబ్బంది డా. శివయ్య, 87వ వార్డు ఇంచార్జ్, గాజువాక క్లస్టర్ -4 మండల అధ్యక్షుడు బొడ్డ గోవింద్, కోమటి రమాదేవి, దుగ్గపు దానప్పలు, జెర్రిపోతుల ఈశ్వరావు, బొడ్డేటి మోదీనాయుడు, చిత్రాడ వెంకట రమణ, బెల్లంకొండ సీతారామ రాజు,కర్రీ అంజి, కాండ్రేగుల మనోహర్, వైద్య సిబ్బంది మెడికల్ సిబ్బంది డాక్టర్ శివయ్య, స్వరూప, దొరబాబు, గోపి, స్పెషలిస్ట్ డాక్టర్స్, సచివాలయం సిబ్బంది, ద్వాక్రా సీ. ఓ సూర్యనారాయణ, ఆర్.పీ లు, ఏ.యన్.యం లు, ఆశ వర్కర్స్, వాలంటీర్లు, గృహ సారధులు, వడ్లపూడి -1 సచివాలయం పరిధిలోని ప్రజలు పాల్గొన్నారు.