రేపు సీఎం వైయ‌స్‌ జగన్‌ పశ్చిమగోదావరి, విశాఖపట్నం జిల్లాల పర్యటన 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి రేపు ప‌శ్చిమ గోదావ‌రి, విశాఖ‌ప‌ట్నం జిల్లాల్లో ప‌ర్య‌టించ‌నున్నారు. భీమవరంలో వైయ‌స్‌ఆర్‌సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు, విశాఖపట్నంలో వైయ‌స్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ హాజరు కానున్నారు.

మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్‌లో జరిగే  గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు, అక్కడి నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుని ఏయూ కన్వెన్షన్‌ సెంటర్‌లో వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు.
 

Back to Top