సర్వేపల్లిలో వైయ‌స్ఆర్‌సీపీలోకి వలసల జోరు 

 మంత్రి కాకాణి సమక్షంలో 30 కుటుంబాలు చేరిక‌

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై వైయ‌స్ఆర్‌సీపీలో చేరికలు జోరందుకున్నాయి. ఇటీవ‌ల స‌ర్వేప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో టీడీపీ నుంచి వైయ‌స్ఆర్‌సీపీలోకి వ‌ల‌స‌ల జోరు కొన‌సాగుతోంది. పొదలకూరు మండలం, పార్లపల్లి గ్రామం నుంచి మంత్రి కాకాణి సమక్షంలో తెలుగుదేశం పార్టీని వీడి కుంచెం శ్రీనివాసులు, ప్రసాద్ లతో కలిసి  30 కుటుంబాలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరాయి.  గ్రామంలో జరిగిన అభివృద్ధికి తామంతా మెచ్చి స్వచ్ఛందంగా వచ్చి జగనన్న ప్రభుత్వానికి పూర్తి మద్దతు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారందరికీ మంత్రి కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డి కండువాలు కప్పి సాద‌రంగా ఆహ్వానించారు. 

Back to Top