ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయ‌స్ జగన్‌ నెరవేర్చారు

అనకాపల్లి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్‌

సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రతి ఇంటికి సంక్షేమం అందించారు 

అన‌కాప‌ల్లి:  గ‌త ఎన్నిక‌ల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నెర‌వేర్చార‌ని అనకాపల్లి వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ అన్నారు. సీఎం వైయ‌స్‌ జగన్‌ ప్రతి ఇంటికి సంక్షేమం అందించారని, ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. అన‌కాప‌ల్లిలో ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో ఎమ్మెల్యే అభ్యర్ధి భరత్ కుమార్ ప్రసంగించారు.  ఆయన మాటల్లోనే..

అందరికీ నమస్కారం. నవరత్నాలకు నాంది, ప్రజాసంక్షేమానికి పునాది, ఆంధ్రప్రదేశ్ రధసారథి అయినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలతో స్వాగతం పలుకుతున్నాం. 2019 ఎన్నికల్లో జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చినమాట ప్రకారం ప్రతీ పథకాన్ని పార్టీలకతీతంగా, కులాలకతీతంగా ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి పథకాలు అందించారు. ఈ పథకాలన్నీ ప్రతి కుటుంబానికి అందేవిధంగా పేద ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండాలని వాలంటీర్లు, సచివాలయాలను ఏర్పాటు చేశారు. ఈవిధంగా ప్రతి పథకాన్ని వాళ్ల కుటుంబాలకు చేర్చినటువంటి జగన్ మోహన్ రెడ్డి గారిని మరొక్కసారి 2024లో వన్స్ మోర్ జగనన్న అని కృతజ్ఞతగా మే 13న జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి జగనన్న మీ అందరికీ మేము తోడుగా ఉన్నామని చెప్పడానికి వచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన జగనన్నకు, ఈ సమావేశానికి ఇంత చక్కటి ఆదరణ కల్పించినటువంటి మీ అందరికీ ఒకటే కోరుకుంటున్నాను. జగన్ మోహన్ రెడ్డి గారిని నేరుగా ఎన్నికల్లో ఎదుర్కొనే దమ్ములేక ప్రతిపక్షపార్టీలు రాళ్లు, రప్పలతో దాడులు చేస్తున్నారు. మీ అందరూ ఓటును ఆయుధంగా మార్చుకుని మే 13వ తారీఖున ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ప్రతిపక్షపార్టీలు బెంబేలెత్తేలాగా జూన్ 4వ తారీఖున పోలింగ్ బూత్ లు ఓపెన్ చేయగానే ఫ్యాన్ గుర్తు ప్రభంజనం ప్రతి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.

Back to Top