ఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు

వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి

ఏ పార్టీ అనిచూడకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం

ఎ్రరగుంట్లలో 1391 ఇళ్లకు రూ.48,74,34,136 అందించాం

ఇంత చొన్నోడు చేసిన పనులను 14 ఏళ్ల అనుభవం చేయగలిగిందా?

ఈ రోజు ప్రతి అక్కచెల్లెమ్మల ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది

ఎ్రరగుంట్లలో ప్రజలతో సీఎం వైయస్‌ జగన్‌ ముఖాముఖి

నంద్యాల:  ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు ఎంపీ, ఎమ్మెల్యేలను ఎన్నుకునే ఎన్నికలు కావని, మన తలరాతలు మార్చేవని వైయస్‌ఆర్‌సీపీ అధ్యక్షులు, సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు ఆళ్లగడ్డ నియోజవర్గంలోని ఎ్రరగుంట్ల గ్రామంలో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే..:

ఈ యర్రగుంట్ల దాదాపుగా 2 సచివాలయాల పరిధికి సంబంధించిన గ్రామం ఇది.  ఒక సచివాలయంలో 1486 ఇళ్లు, మరో సచివాలయంలో 1519 ఇళ్లు.. ఈ రెండు సచివాలయాల పరిధిలో మొత్తం 3005 ఇళ్లు ఉన్నాయి. కాసేపటి కిందటనే ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగాను. ఈ గ్రామంలో సచివాలయాల దగ్గర వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి ఈ గ్రామానికి సంబంధించిన సచివాలయం పరిధిలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఆ ఇళ్లలో ఎంత మంది లబ్ధిదారులు  ఉన్నారు, ఎవరెవరికి ఈ గ్రామంలో ఏమేమి అందాయన్న డీటెయిల్స్ ఆ సచివాలయాల పరిధిలో డిస్ ప్లే చేయడం జరుగుతోంది. ఆ కార్యక్రమమే వై ఏపీ నీడ్స్ జగన్ అని చెప్పి కొద్ది రోజుల కిందట కూడా చేయడం జరిగింది. 

ఈ గ్రామంలో ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారు, ఏయే పథకాల్లో ఎవరెవరు ఎంతెంత మంది ఉన్నారని చెప్పి, ఇదే గ్రామంలో మీ సచివాలయాల పరిధిలో ఉన్న డేటాను తెప్పించాను.

యర్రగుంట్ల గ్రామంలో 93.60 శాతం లబ్ధిదారులు
నిజంగా బహుశా ఎవరికీ కూడా ఊహకు అందని విషయాలు.. ఈ ఒక్క సచివాలయం గమనిస్తే చాలు, ఈ యర్రగుంట్ల పరిధిలోని 3005 ఇళ్లకు సంబంధించిన వివరాలు గమనిస్తే, ఓ సచివాలయం పరిధిలో 1486 ఇళ్లకు గానూ...  ఏకంగా 1391 ఇళ్లు అంటే 93.60 శాతం వివిధ పథకాల్లో లబ్ధి పొందగా... అదే యర్రగుంట్ల రెండో సచివాలయం పరిధిలో 1519 ఇళ్లకు గానూ, 1448 ఇళ్లుకు చెందిన లబ్ధిదారులు వివిధ పథకాల్లో లబ్ధి పొందారు.. అంటే ఏకంగా 95.32 శాతం ఇళ్లకు లబ్ధి చేకూరింది.

గమనించినట్లయితే, ఈ 58 నెలల కాలంలో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 2 సచివాలయాల పరిధిలో ఎంత డబ్బులు, ఏ మేరకు సొమ్ము ప్రతి ఇంటికీ అందింది అని డీటెయిల్స్ తెప్పిస్తే, అదే సచివాలయంలోనే డిస్ ప్లే చేశారు. 

అర్హతే ప్రామాణికంగా..
ఆశ్చర్యం కలిగించే నంబర్లు ఏమిటో తెలుసా? అక్షరాలా ఈ 58 నెలల్లోనే ఈ ఒక్క గ్రామంలోనే ఒక వైయస్సార్ పెన్షన్ కానుక, వైయస్సార్ రైతు భరోసా, ఓ అమ్మ ఒడి, ఓ ఆసరా, ఓ వైయస్సార్ చేయూత, ఓ జగనన్న విద్యాదీవెన, హౌసింగ్ కు సంబంధించిన డైరెక్టుగా డీబీటీ, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, రైతన్నలకు ఇన్ పుట్ సబ్సిడీ, జగనన్న వసతి దీవెన, సున్నా వడ్డీ కింద పొదుపు సంఘాలకు ఇచ్చిన డబ్బులు, క్రాప్ ఇన్సూరెన్స్, జగనన్న తోడు, చేదోడు, కాపు నేస్తం, వైయస్సార్ బీమా, వైయస్సార్ ఆరోగ్యశ్రీ, కోవిడ్ కు సంబంధించిన టైమ్ లో కోవిడ్  సహాయం, ఈబీసీ నేస్తం, నేతన్న నేస్తం, సున్నావడ్డీ పంట రుణాలు, కల్యాణమస్తు, వాహన మిత్ర, అర్చకులకు ఇచ్చే బెనిఫిట్స్.. ఇలా మొత్తంగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్లిపోవడం.. ఎక్కడా ఎవరూ కూడా లంచాలు అడగడం లేదు. ఎక్కడా ఎవరూ కూడా వివక్ష చూపించడం లేదు. ఏ కులం, ఏ మతం, ఏ వర్గం, అడగడం లేదు. చివరికి మీరు ఏ పార్టీ అని కూడా అడగడం లేదు. 

3005 ఇళ్లకు రూ.48.74 కోట్లు
అర్హత ఉంటే చాలు.. ఆ ప్రతి అక్కచెల్లెమ్మ కుటుంబాల్లో సంతోషాలను చూడాలనే ఏకైక ఉద్దేశంతో మీ బిడ్డ బటన్లు నొక్కుతున్నాడు. నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు పోతున్నాయి. ఈ మాదిరిగా నేను చదివి వినిపించిన ఈ రకరకాల పథకాలకు సంబంధించి ఈ 58 నెలల్లో ఈ ఒక్క గ్రామంలోనే ఉన్న ఈ 3005 ఇళ్లకు సంబంధించిన వివరాలు చెబుతున్నాను. రూ.48,74,34,136 నేరుగా వివిధ పథకాల ద్వారా అందాయి. ఆశ్చర్యం కలిగించే విషయాలు..  వైయస్సార్ పెన్షన్ కానుక కింద రూ.16,52,71,500 ఈ ఒక్క ఊర్లో నే అందింది.  నా అవ్వాతాతల ముఖంలో, వితంతువులైన అక్కచెల్లెమ్మల ముఖాల్లో చిరునవ్వులు చూడాలని, వికలాంగులైన అక్కచెల్లెమ్మలు, సోదరుల ముఖాల్లో అండ, తోడు కనపడాలని ఈ కార్యక్రమం జరిగింది.

వైయస్సార్ రైతు భరోసా కింద రూ.6,80,96,500, అమ్మ ఒడి కింద 1043 మంది తల్లులకు రూ.4,69,35,000.. ఈ ఒక్క గ్రామంలోనే అందింది. వైయస్సార్ ఆసరా కింద రూ.3,88,16,374, వైయస్సార్ చేయూత కింద 492 మంది నా అక్కచెల్లెమ్మలకు రూ.2,96,25,000, జగనన్న విద్యా దీవెన కింద 837 మంది తల్లులకు రూ.2,46,41,602 కోట్లు.. ఇలా చదువుకుంటూ పోతే.. హౌసింగ్ కింద రూ.2,75,72,361, ఆరోగ్యశ్రీ కింద రూ.2,24,21,596, ఇన్ పుట్ సబ్సిడీ కింద రూ.1,13,71,570 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.1,00,98,149, సున్నావడ్డీ కింద రూ.86,48,916, క్రాప్ ఇన్సూరెన్స్ కింద రూ.67,26,205, జగనన్న తోడు కింద ఇచ్చిన లోన్లు రూ.41,30,000, కాపు నేస్తం కిద రూ.31,20,000, చేదోడు కింద రూ.40,40,000, జగనన్న తోడు కింద రూ.41,30,000 లోన్లు, వైయస్సార్ ఆరోగ్య ఆసరా కింద రూ.21,48,200 ఇలా మొత్తంగా చూస్తూ పోతే ఈ ఒక్క గ్రామంలోనే కేవలం ఈ ఒక్క గ్రామంలోనే ఏకంగా 93.60 శాతం మంది బెనిఫిషరీస్, ఎక్కడా ఎవరూ లంచాలు ఇవ్వాల్సిన పని లేదు. ఎక్కడా ఎవరూ వివక్షకు లోను కాకుండా, ఒక్కరికి లంచం ఇచ్చామనే మాట వినపడకుండా ఈ ఒక్క గ్రామంలోనే నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపించిన సొమ్ము రూ.48,74,34,136. 

నాన్ డీబీటీ ద్వారా కూడా..
ఇది కాక మన ప్రభుత్వం చేస్తున్న నాన్ డీబీటీ పథకాలు కూడా ఒక్కసారి గమనిస్తే, అంటే ఇళ్ల పట్టాలకు సంబంధించి 468 మందికి, ఇళ్లు అయిపోయిన వారు 144 మంది, రైస్ కార్డులకు సంబంధించి 2,594కు సంబంధించి, 8వ తరగతి చదువుతున్న పిల్లలకు ఇచ్చిన ట్యాబులు 76 మందికి ఇచ్చాం. విద్యాకానుక కింద 670, సంపూర్ణ పోషణ కింద 189. వీటికి సంబంధించి నేను చెప్పడం లేదు. ఇవన్నీ ఇన్ డైరెక్టుగా ఇస్తున్నాం కాబట్టి వీటి బెనిఫిట్ ఎంతో నేను చెప్పడం లేదు. కానీ కేవలం బటన్ నొక్కడం, నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి లేదా ఆ అవ్వల చేతుల్లోకి వెళ్లడం.. ఇవే చూసుకుంటే రూ.48,74,34,136. 

నేను అడుగుతున్నాను. మన ప్రభుత్వానికి ముందు కూడా మీరు చాలా ప్రభుత్వాలు చూశారు. నేను చాలా చిన్న పిల్లోడిని. నా కన్నా పెద్దవాళ్లు, నాకన్నా అనుభవం గలవారు, నా కన్నా చాలా అనుభవం ఉందని గొప్పలు చెప్పుకునేవారు చాలా మంది ముఖ్యమంత్రులుగా పని చేశారు. కానీ నేను ఒకటే ఒకటి అడుగుతున్నా మీ అందరితో కూడా. ఇంత మందిని మీరు చూశారు. మరీ ముఖ్యంగా రాష్ట్రం విడిపోయిన తర్వాత నా కన్నా ముందు 75 ఏళ్ల ముసలయాన పరిపాలన చేయడం కూడా చూశారు. ఆయన ఏకంగా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మూడు సార్లు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. అటువంటి గొప్ప గొప్ప పాలనలను మీరు చూశారు కదా.. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నాను. నేను చాలా చిన్నోడ్ని. వయసులో కూడా చిన్నోడిని. ఇంత చిన్నోడు చేసిన పనులు ఇదే ఒక గ్రామంలోనే 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఎక్స్ పీరియన్స్ ఉన్నోళ్లు ఏపొద్దయినా చేశారా అని అడుగుతున్నాను. ఆలోచన చేయాలని అడుగుతున్నాను. 

స్కూళ్లలో సమూల మార్పులు.
ఈరోజు ఏరకంగా బతుకులు మారాయి, జీవితాలు మారాయి, వ్యవస్థలోకి మార్పులు తీసుకురాగలిగాం అన్నది ఒక్కసారి గమనించమని కోరుతున్నాను. ఈరోజు ఈ బటన్ నొక్కడమే కాదు, అక్కచెల్లెమ్మల కుటుంబాలకు ఆర్థిక సాధికారత ఇవ్వడం, ఇదొక్కటే కాదు జరిగింది, ఈ లిస్టు చదివేటప్పుడు నేను చెప్పాను. విద్యా కానుక గురించి కూడా చెప్పాను. అదే మాదిరిగా ట్యాబులు గురించి కూడా చెప్పాను. ఒకసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఈరోజు గ్రామాలు బాగుపడ్డాయి. స్కూళ్లు మారిపోయాయి. స్కూళ్లలో డిజిటల్ బోధన అందుబాటులోకి వస్తోంది. పిల్లల చేతుల్లో ట్యాబులు కనిపిస్తున్నాయి. స్కూళ్లన్నీ ఇంగ్లీషు మీడియంతో కనిపిస్తున్నాయి. టెక్ట్స్‌ బుక్కులు కూడా ఒక పేజీ ఇంగ్లీషు ఉంటే మరో పేజీ తెలుగుతో బైలింగువల్ టెక్ట్స్‌ బుక్కులు మన పిల్లల చేతుల్లో కనిపిస్తున్నాయి. 

మొట్ట మొదటి సారిగా స్కూళ్లు బాగుపడ్డాయి. మొట్ట మొదటిసారిగా మన గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఇక్కడే వచ్చాయి. ఫ్యామిలీ డాక్టర్లు ఇక్కడే వస్తున్నారు. ఆరోగ్య సురక్షతో ప్రతి ఇంటినీ జల్లెడ పడుతూ ప్రతి పేదవాడికి టెస్టులు కావాలన్నా, మందులు కావాలన్నా, నేరుగా ఇంటికే వచ్చి చేస్తున్నారు. స్కూళ్లు బాగుపడ్డాయి, వైద్యం బాగుపడింది. ఎప్పుడూ చూడని విధంగా రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే కనిపిస్తోంది. ప్రతి రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తున్నారు. ప్రతి ఎకరా ఈ క్రాప్ అయ్యింది. ఇంతకు ముందు అయితే పంటల బీమా ఎలా చేసుకోవాలో కూడాచాలా మందికి తెలియదు. క్రాప్ లోన్ల కోసం వెళ్లినప్పుడు మాత్రమే ఆ బ్యాంకులు ఆ లోనులో ఒక 5 పర్సెంటో 4 పర్సెంటో కట్ చేసుకుని ఇన్సూరెన్స్ వాళ్ళకు ఇచ్చేవారు. 

సాగులో తోడుగా...
క్రాప్ లోన్స్ పుట్టకపోతే, క్రాప్ లోన్ కోసం బ్యాంకులకు వెళ్లకపోతే, ఇన్సూరెన్స్ కూడా ఎలా చేసుకోవాలో తెలియని పరిస్థితిలో వ్యవస్థ బతికేది. అలాంటిది ఈ రోజు గ్రామంలోనే ఆర్బీకే, ప్రతి ఎకరా ఈ క్రాప్, ఉచిత పంటల బీమా, ఇన్ పుట్ సబ్సిడీ కూడా నష్టం జరిగిన వెంటనే ఆ సీజన్ ముగిసేలోగానే ఇస్తున్న గొప్ప ప్రక్రియ. ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు పెట్టుబడి విషయంలో, పెట్టుబడి కోసం రైతన్నకు సహాయంగా ఏకంగా రూ.13,500 పెట్టుబడి సహాయంగా ఇచ్చే గొప్ప మార్పు జరిగింది కూడా కేవలం మీ బిడ్డ హయాంలోనే. వ్యవసాయం మారింది, స్కూళ్లు మారాయి. గ్రామంలో కనిపిస్తున్న హాస్పటళ్లు మారాయి.

విప్లవాత్మకంగా ఆరోగ్యరంగ మార్పులు.
ఆరోగ్యశ్రీ విస్తరించింది. ఏకంగా 3300 ప్రొసీజర్లకు తీసుకునిపోయాం. ఏకంగా రూ.25 లక్షల దాకా ఈరోజు ఏ పేదవాడైనా కూడా జేబులో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే  ఉచితంగా వైద్యం చేయించుకొనే గొప్ప పరిస్థితి ఈరోజు ఉంది. 

అక్కచెల్లెమ్మలకు అండగా...
ఆలోచన చేయమని అడుగుతున్నాను. మార్పులు అన్నది ఏ స్థాయిలో జరుగుతున్నాయో అని ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఈరోజు ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. ప్రతి అక్కచెల్లెమ్మ కూడా ఈరోజు తన కాళ్ల మీద తాము నిలబడటానికి ఈరోజు ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఈరోజు ప్రతి అక్కచెల్లెమ్మ కూడా నేను గేదెలు కొనుక్కోవచ్చు, నేను షాపులు పెట్టుకోవచ్చు, నేను కూడా ఆదాయం సంపాదించుకోవచ్చు అని ప్రతి అక్కచెల్లెమ్మ ముఖంలో కాన్ఫిడెన్స్, ఆత్మ విశ్వాసం కనిపిస్తోంది. ఏ అక్కచెల్లెమ్మ కూడా ఎక్కడికైనా బయటకు పోవాలంటే భయపడాల్సిన పని లేదు. ఫోన్లో దిశ యాప్, గ్రామంలోనే మహిళా పోలీసు. ఏ అక్కచెల్లెమ్మ బయటకు పోయినా కూడా దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఎస్ఓఎస్ బనట్ నొక్కినా, లేదా ఆపదలో ఉన్నప్పుడు 5సార్లు ఫోన్ గట్టిగా షేక్ చేసినా చాలు.. 10 నిమిషాల్లోనే అక్కచెల్లెమ్మలకు ఫోన్ వస్తోంది. ఆపదలో ఉన్నారా అక్కా.. చెల్లెమ్మా.. అని పోలీస్ సోదరుడు అడుగుతున్నాడు. 10 నిమిషాల్లోనే మీ ఇంటి దగ్గరకే వచ్చి ఆపదలో ఉన్న అక్కచెల్లెమ్మలకు ఒక అన్నగా తోడుగా నిలబడుతోంది పోలీస్ వ్యవస్థ. 

ఇవన్నీ కూడా నేను ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇవన్నీ కూడా గతంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రి అని చెప్పుకునే వాళ్లు, మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేశాం, ఎక్స్ పీరియన్స్ మాకెంతో ఉందని చెప్పుకునేవాళ్లు ఏరోజు కూడా ఎవ్వరూ కూడా ఆలోచన చేయడానికి కూడా ఏ ఒక్కరూ సరిపోని విధంగా మీ బిడ్డ ఈ 58 నెలల కాలంలోనే మార్పు తీసుకుని వచ్చాడు. గమనించమని కోరుతున్నాను. ఈరోజు మీ అందరితో ఈ విషయాలన్నీ చెబుతూ ఈ మార్పు కొనసాగడం ఎంత అవసరమో ఆలోచన చేయమని అడుగుతున్నాను. మీ అందరితో ఇదే కోరుతున్నాను. 


మన భవిష్యత్ కోసం వేసే ఓటు ఇది
గత ఎన్నికల్లో నాకు ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నాను. రకరకాల కారణాలు కావచ్చు. కులం కావచ్చు, లేదా పార్టీలో అభిమానించేవారు వేరేవాళ్లు అయి ఉండొచ్చు, కానీ ఇవాళ అందర్నీ అడుగుతున్నాను. ఒకసారి ఇంటికి వెళ్లండి. ఓటు వేసేటప్పుడు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకొనే ఓటు కాదిది. మనం వేసే ఈ ఓటు  మన భవిష్యత్ కోసం ఓటు వేస్తున్నాం. అందరూ కూడా ఇంటికి వెళ్లి మీ ఇంట్లో ఉన్న మీ ఇల్లాలితో మాట్లాడండి. మీ పిల్లలతో మాట్లాడండి. అవ్వాతాతలతో మాట్లాడండి. మాట్లాడిన తర్వాత అందరూ కలిసికట్టుగా నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓటు వేసేది ఒక ఎమ్మెల్యేకో, ఎంపీకో కాదు.. మన తలరాతలు మార్చే ఎన్నిక ఇది. దేవుడి దయ వల్ల ఈ మంచి చేయగలిగాం. ఇంకా ఏదైనా సిస్టమ్సలో ఎఫిషియన్సీ పెంచేదాని కోసం ఇంకా ఏవైనా సలహాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వమని కోరుతున్నాను. 

ఒక్క విన్నపం...
మీ అందరితో కూడా ఒకే ఒక చిన్న విన్నపం చేయదల్చుకున్నాను. ఈ మధ్య కాలంలో కొన్ని బటన్లు నొక్కాను. ఈబీసీ నేస్తం, చేయూత ఇటువంటి కొన్ని బటన్లు నొక్కాను. ఎలక్షన్ కోడ్ వచ్చేస్తోంది కాబట్టి ఆన్ గోయింగ్ ప్రోగ్రామ్స్ కింద ట్రీట్ చేయరని చెప్పి నొక్కేశాం. దీనికి సంబంధించిన డబ్బులు ఒక పది రోజులు అటూ ఇటుగా మీ అందరికీ బ్యాంకుల్లో పడతాయి. మామూలుగా ఎప్పుడూ కూడా నేను ఇలా చెప్పాల్సిన అవసరం లేదు. బటన్ నొక్కిన వెంటనే నేరుగా వారం రోజుల్లోపు పడిపోయే పరిస్థితి ఉండేది. కానీ ఈసారి మాత్రం ఎన్నికల కోడ్ వచ్చేస్తోంది కాబట్టి సిస్టమ్ ఆన్ లో ఉండాలి కాబట్టి బటన్లు నొక్కాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి నొక్కేశాను. కొంచెం పది రోజులు అటూ ఇటుగా అది కూడా జరిగిపోతుంది. ఈ ఒక్క విషయం మనసులో పెట్టుకుని మీరేదైనా సలహాలు, సూచనలు ఇవ్వాలనుకుంటే మీ బిడ్డ, మీ అన్న, మీ తమ్ముడు వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏదైనా సలహాలు ఇవ్వాలని సీఎం  వైయస్‌. జగన్ కోరారు.

కార్యక్రమంలో చివరగా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఏమన్నారంటే..

మీ అందరి ప్రేమానురాగాలకు, ఆప్యాయతలకు పేరుపేరునా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. వీలైనంత ఎక్కువ మందితో మాట్లాడించే ప్రయత్నం చేశాం. అందరితో బహుశా మాట్లాడే అవకాశం, పరిస్థితులు కూడా సమయాభావ కారణాల వల్ల అందరికీ ఉండకపోవచ్చు కాబట్టి.. మీ అందరికీ ఎలాగూ స్లిప్పులు ఇచ్చారు. ఆ స్లిప్పుల్లో మీరు ఏదైనా సలహాలు ఇవ్వాలనుకున్నవి ఆ బాక్సులో వేస్తే అవి ఎలాగూ నా దగ్గరికి వస్తాయి. అందులో మనం ఏదైనా సలహా తీసుకుని... ఉన్న వ్యవస్థను ఇంకా కొంత బాగు పరిచే కార్యక్రమంలో భాగంగా ఇంకా ఏమైనా బెటర్ గా చేయగలిగే అవకాశాలు, పరిస్థితులు ఉంటే కచ్చితంగా చేసేందుకు మీ సలహాలు, సూచనలు ఉపయోగపెట్టుకుంటాను అని కూడా మీ అందరితో మరొక్కసారి తెలియజేస్తూ.. మీరు వచ్చి మీ సలహాలు, సూచలు ఇస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నందుకు ఈ గ్రామ వాసులందరికీ మనస్పూర్తిగా హృదయపూర్వకంగా పేరుపేరునా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకొంటూ సెలవు తీసుకుంటున్నాను.

Back to Top