కర్నూలు జిల్లా సిద్ధమా…?

సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్‌

క‌ర్నూలు:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు చేప‌ట్టిన మేమంతా సిద్ధం యాత్ర విజ‌య‌వంతంగా కొన‌సాగుతోంది. 3వ రోజు క‌ర్నూలు జిల్లాలో సీఎం వైయస్ జ‌గ‌న్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర శుక్రవారం (మార్చి 29) కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచి ప్రారంభం కానుంది. ఈ మేర‌కు వైయ‌స్ జ‌గ‌న్ క‌ర్నూలు జిల్లా సిద్ధ‌మా అంటూ ట్వీట్ చేశారు. 
ఇవాళ యాత్ర పెంచికలపాడు నుంచి రామచంద్రపురం, కోడుమూరు, హంద్రీ కైరవడి, గోనెగండ్ల మీదుగా రాళ్లదొడ్డి  చేరుకోనుంది. రాళ్లదొడ్డికి ముందు భోజన విరామం. అనంత‌రం కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరులోని  వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గరకు చేరుకోనున్న సీఎం వైయ‌స్ జగన్‌ ఎన్నికల ప్రచార రథం ..సాయంత్రం బహిరంగ సభలో సీఎం వైయ‌స్ జగన్‌ ప్రసంగిస్తారు.

Back to Top