తాడేపల్లి: మహిళలపై దాడులు చేయడం అత్యంత హేయమని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కాకుమాను రాజశేఖర్ అన్నారు. హోంమంత్రి తానేటి వనిత మీద టీడీపీ నేతలు దాడికి ప్రయత్నించడం దారుణమన్నారు. తెలుగుదేశం,చంద్రబాబు ఓటమి ఖాయం అవడంతో ప్రస్టేషన్ లో దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలలో పోటీచేసే పార్టీలు గతంలో తాము ప్రజలకు ఏం మేలు చేశామో చెప్పుకుని ఓట్లు అడగాలి. - అలా కాకుండా చంద్రబాబులాగా దౌర్జన్యాలు చేస్తామంటే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. అసలు తెలుగుదేశం పార్టీ మహిళలపై దాడులు జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఎన్నికల సంఘం నిద్ర నటిస్తోందా?. చంద్రబాబు చెప్పినట్లు చేయటమే ఎన్నికల సంఘం పనిగా పెట్టుకుందా? అని నిలదీశారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సతీమణి రమాగారిపై దాడి చేసినా ఈసీ పట్టించుకోలేదన్నారు. విజయవాడలో బోండా ఉమా దళిత మహిళలపై దాడులకు ఉసిగొల్పినా ఈసి ఎందుకు చర్యలు తీసుకోలేదు? అన్నారు. మహిళలపై దాడులకు సంబంధించి ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి.. చంద్రబాబు ఇలాంటి దాడులకు స్వస్తి చెప్పకపోతే ప్రజలే తగిన బుధ్ది చెబుతారని రాజశేఖర్ అన్నారు.