చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేయించే ద‌మ్ముందా?

ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్‌
 

సత్యసాయి: ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సవాల్ విసిరారు. సోమవారం  ఎన్నికల ప్రచార కార్యక్రమంలో  పాల్గొన్న కేతిరెడ్డి మాట్లాడారు. సత్యకుమార్‌ ఢిల్లీలో అంత పలుకుబడి ఉంటే.. చేనేత వస్త్రాలపై జీఎస్టీ తొలగిస్తామని కేంద్రంతో ప్రకటన చేయించాలన్నారు.  అలా  చేస్తే.. తాను ఎన్నికల నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ఛాలెంజ్‌ చేశారు. అలాగే సత్యకుమార్‌ యాదవ కులస్తుడిగా చెప్పుకుంటున్నారని.. కానీ, నిరూపించుకోవాలని  కేతిరెడ్డి సవాల్ చేశారు. కేతిరెడ్డి సమక్షంలో పలువురు నేత వైయ‌స్ఆర్‌సీపీలో చేరారు.

Back to Top