పేదవాడి ఆక్సిజన్ సీఎం వైయ‌స్ జగన్

కిర్లంపూడిని పాకిస్తాన్‌ చేసిన బాబును వదలను

వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు ముద్రగడ

కాకినాడ:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేదవాడి ఆక్సిజన్ అని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కుడు ముద్రగడ పద్మ‌నాభం అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే వచ్చేది రాక్షస రాజ్యమని అన్నారు.  2016లో రాక్షస రాజ్యం చూశానని అగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ముద్రగడ మీడియాతో మాట్లాడారు. 
 
 నాలుగేళ్ళ పాటు చంద్రబాబు రావణ రాజ్యం అనుభవించాం. కిర్లంపూడిని పాకిస్ధాన్ చేసేశాడు. చంద్రబాబు కడుపులో అధికార ఆకలి దహించిపోతుంది. అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని రావణకాష్టం చేస్తాడు. అబద్దాలు చెప్పి అర్జెంటుగా అధికార కుర్చిలో కూర్చోవాలని చంద్రబాబు ఉన్నాడు. ఓటర్లు ఆలోచన చేయాలి. 

ఆబద్దాలు చెప్పేవాడికి లొంగిపోతే పేదవాడికి ఆక్సిజన్ దొరకదు. పేదవాడి ఆక్సిజనే సీఎం వైయ‌స్ జగన్. ఆ ఆక్సిజన్‌ను కాపాడుకోవాలని ప్రజల్ని కోరుతున్నాను. సీఎం వైయ‌స్‌ జగన్ అమలు చేసిన సంక్షేమ పధకాలనే అమలు చేస్తానంటున్న చంద్రబాబు మనకు అవసరమా?. దారుణమైన పాలన చేసిన చంద్రబాబును నేను వదలను. భగవంతుడు వేసిన శిక్ష చంద్రబాబు ఇంకా అనుభవించాలి’ అని ముద్రగడ అన్నారు. 

Back to Top