ఎన్నికల తరువాత మంగళగిరి టీడీపీ కార్యాలయానికి తాళం కాసేపట్లో వైయస్ఆర్సీపీ మేనిఫెస్టో విడుదల చంద్రబాబు, చింతమనేని ఇద్దరూ బాధితులకు క్షమాపణ చెప్పాలి ఐదేళ్ల ప్రయాణం అద్భుతం ఆ ద్రోహం మీ బాబుదే రామోజీబాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట
బస్సుయాత్రకు జనం జైత్రయాత్ర.
27 Mar 2024 6:09 PM
అశేషంగా కదలివచ్చిన ప్రజలు.
పల్లెపల్లెల నుంచి కదం తొక్కిన జనం.
జనంతో కిక్కిరిసిన వేంపల్లె ప్రధాన రహదారి
వైయస్ఆర్ జిల్లా: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర జన ప్రవాహంలా కొనసాగుతోంది. ఇవాళ మధ్యాహ్నం ఇడుపులపాయ నుంచి సీఎం వైయస్ జగన్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. వైయస్ఆర్ ఘాట్ వద్ద సర్వమత ప్రార్థనలను నిర్వహించి యాత్రకు ప్రారంభించిన వైయస్ జగన్కు దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. తమ అభిమాన నాయకుడు సీఎం వైయస్ జగన్ను చూసేందుకు తండోపతండాలుగా జనం తరలివస్తున్నారు. ప్రతి గ్రామానా పూలు చల్లుతూ ఘన స్వాగతం పలుకుతున్నారు. వేంపల్లెలో పూలు చల్లుతూ కోలాటం అడుతూ మహిళల స్వాగతం పలికారు. యర్రగుంట జనసంద్రంగా మారింది. గ్రామా గ్రామాన ప్రజలు తరలిరావడంతో ప్రొద్దుటూరు సభకు గంటన్నర అలస్యంగా ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రొద్దుటూరు జనంతో పొటెత్తుతోంది.