హిందూపురం చేరుకున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

హిందూపురం: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సీఎం వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డి హిందూపురం చేరుకున్నారు. ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వైయ‌స్ఆర్ సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. హెలిప్యాడ్ నుంచి హిందూపురం పట్టణం అంబేడ్కర్ సెంటర్‌ వ‌ర‌కు ప్ర‌జ‌లు సీఎంకు స్వాగ‌తం ప‌లికారు. సీఎం రాక‌తో హిందూపురం జ‌న‌సంద్ర‌మైంది. ర‌హ‌దారుల‌న్నీ జ‌నంతో కిక్కిరిపోయాయి. మ‌రికాసేప‌ట్లో అంబేడ్క‌ర్ సెంట‌ర్‌లో జ‌రిగే ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో హిందూపురం ప్ర‌జ‌ల‌ను ఉద్దేశించి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగించ‌నున్నారు. 

హిందూపురం స‌భ అనంత‌రం మధ్యాహ్నం 12.30 గంటలకు చిత్తూరు పార్లమెంట్ పరిధిలోని పలమనేరు నియోజకవర్గ కేంద్రంలోని బస్‌స్టాండ్ సెంటర్‌లో జరిగే సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు నెల్లూరు పార్లమెంట్ పరిధిలోని నెల్లూరు సిటీ గాంధీ విగ్రహం సెంటర్‌లో జరిగే ప్రచార సభలో పాల్గొని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌సంగిస్తారు. 

Back to Top