సీఎం వైయ‌స్ జ‌గ‌న్ రేప‌టి ఎన్నిక‌ల ప్ర‌చారం షెడ్యూల్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి  ఎన్నికల ప్రచార సభల 30వ తేదీ (మంగ‌ళ‌వారం)షెడ్యూల్ ను వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శిల ర‌ఘురాం విడుద‌ల చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ 30 వ తేదీన ఎన్నికల ప్రచారాన్ని మూడు నియోజకవర్గాల్లో నిర్వహిస్తారు. మంగళవారం ఉదయం 10 గంటలకు  ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని  కొండెపి నియోజకవర్గం టంగుటూరులో   జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. 

అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు కడప  పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు  నియోజకవర్గంలో మైదుకూరు 4 రోడ్ల జంక్షన్ లో  జరిగే సభ లో పాల్గొంటారు. 

ఆ త‌రువాత మధ్యాహ్నం 3 గంటలకు రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గం కలికిరి లో   జరిగే ప్రచార సభలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొంటారు.

Back to Top