చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదు

వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ 

తాడేప‌ల్లి: చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేద‌ని వైయ‌స్ఆర్‌సీపీ మహిళా నేత వాసిరెడ్డి పద్మ 
అన్నారు. సచివాలయాలలో భర్తీ చేసిన ఉద్యోగాలలో అత్యధిక శాతం మంది మహిళలే ఉన్నార‌ని ఆమె చెప్పారు. బుధ‌వారం వాసిరెడ్డి ప‌ద్మ మీడియాతో మాట్లాడారు.

- మహిళలను మోసం చేసే మాటలు చంద్రబాబు మాట్లాడుతున్నారు.రాష్ర్టంలో ఏ మహిళా కూడా చంద్రబాబును నమ్మే పరిస్ధితి లేదు.

- చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు చేసిన మోసం వల్ల డ్వాక్రా మహిళలు రోడ్డున పడ్డారు.

- మహిళలకు డ్వాక్రా రుణమాఫీ జగన్ గారు చేసి చూపించారు.అందుకే మహిళలు వాళ్ల కాళ్ళ పై నిలబడి మహిళా సాధికారిత సాధించారు.

- వైయస్సార్ సిపి అధికారంలోకి వచ్చాక మహిళలకి స్వర్ణ యుగం ప్రారంభమైంది.

- ఆసరా,చేయూత వంటి పథకాలతో మహిళలు అభివృద్ధి చెందుతున్నారు.చంద్రబాబు పాలన ఎంత దుర్మార్గంగా,మోసాలతో ఉంటుందో మహిళలకి తెలుసు.

- చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు వడ్డీ భారం ఉండేది ఇప్పుడు వడ్డీ రాయితీతో డ్వాక్రా మహిళలు ఆనందంగా ఉన్నారు.

- చంద్రబాబు నంగనాచిలాగా మహిళలు ఎదుట మద్యం గురించి మాట్లాడుతున్నారు.బెల్ట్ షాపులు పెట్టింది నువ్వు కాదా.మద్యాన్ని ఊరూరా పారించింది నీవు కాదా.

- కేంద్రం వల్ల పెట్రోల్,నిత్యావసర వస్తువులు,సరుకుల రేట్లు పెరుగుతున్నాయి.ఇది బహిరంగ రహస్యం.అయినా బిజేపితో పొత్తుతో ఉన్నారు కాబట్టి బిజేపిని నిలదీసే దమ్ములేక జగన్ గారిపై చంద్రబాబు బురద చల్లుతున్నారు. బీజేపీని ఎందుకు అడగం లేదు..

- రాజకీయపదవులలోనే కాదు,ప్రభుత్వ వర్క్స్ లలో సైతం 50%మహిళలకి రిజర్వేషన్ అమలు చేసాము. చంద్రబాబూ మీకు దమ్ముంటే అమలు చేయగలరా.

- చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదు..సచివాలయాలలో భర్తీ చేసిన ఉద్యోగాలలో అత్యధిక శాతం మంది మహిళలే ఉన్నారు.

- రాష్టంలో గంజాయి ఉందని అబద్దాలు చంద్రబాబు చెబుతున్నాడు.

- విశాఖలో పట్టుబడిన 25వేల టన్నుల డ్రగ్స్ రవాణా వెనకాల ఎవరు ఉన్నారో అందరికి తెలుసు.

- గంజాయి సాగు మేము నాశనం చేశాం.ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం సైతం జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు.

- మీ హయాంలో గంజాయి లేదా...మహిళలు మిస్సింగ్ గురించి సైతం అబద్దాలు చెబుతున్నారు.మహిళలకు భధ్రత కల్పించింది జగన్ 

- చంద్రబాబు వంద అబద్దాలు చెబితే అందులో ఒకటేనా నిజం ఉండాలి కదా.

Back to Top