

















జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి
2014లో 23 మంది ఎమ్మెల్యేలను లాక్కుంటేనే వైఎస్సార్సీపీ వెనకడుగు వేయలేదు
వైయస్ఆర్సీపీ అంటే ప్రాణాలిచ్చే కార్యకర్తలు లక్షల్లో ఉన్నారు
వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు: జమ్ములమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా హెచ్చరించారు. గ్రామగ్రామాన వైయస్ఆర్సీపీ కోసం ప్రాణాలిచ్చే కార్యకర్తలు ఉన్నంత కాలం తమ పార్టీకి ఏమీ కాదని ఆయన స్పష్టం చేశారు. సోమవారం ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆదినారాయణరెడ్డి లాంటి వారు వైయస్ జగన్ను మోసం చేసి వెళ్లినందుకు ఐదేళ్లు రాజకీయంగా దూరం కావాల్సి వచ్చిందని, ఇలా చేసేవారందరికీ భవిష్యత్తులో ఇదే గతిపడుతుందని రాచమల్లు హెచ్చరించారు. సాయిరెడ్డి వెళ్లడంతోనే వైయస్ జగన్ విశ్వసనీయత దెబ్బతిన్నదని విమర్శిస్తున్న షర్మిలకు మా పార్టీలో ఉన్న లక్షలాది మంది కార్యకర్తలు కనిపించ లేదా అని ప్రశ్నించారు.
రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఏమన్నారంటే..
వైయస్ఆర్సీపీ మరింత ఉత్సాహంగా ప్రజల్లోకి త్వరలోనే...