పేదల దశాబ్ధాల కలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారు

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

గుంటూరు: పేదల దశాబ్ధాల కలను సీఎం వైయస్‌ జగన్‌ నెరవేరుస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తుంటే కోర్టుల ద్వారా టీడీపీ అడ్డుకునే యత్నం చేసిందని మండిపడ్డారు. కోర్టులో పేదలకు న్యాయం జరిగిందని చెప్పారు. పేదల పట్ల చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రాజధానిలో పేదలు ఉండకూడదనే చంద్రబాబు కుట్ర అన్నారు. పేదలకు సీఎం వైయస్‌ జగన్‌ అండగా నిలిచారని ఎమ్మెల్యే ఆర్కే తెలిపారు. మంగళగిరిలో దీపావళి నాటికి జగనన్న కాలనీలు పూర్తవుతాయని చెప్పారు.
 

Back to Top