‘రెడ్‌ బుక్‌ని కాదు.. మేనిఫెస్టో అమలు చేయండి’

మాజీ మంత్రి అంబటి రాంబాబు

తాడేపల్లి:  ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా ప్రత్యర్థి వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులపై దాడులే లక్ష్యంగా పని చేస్తున్న ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు.  

ప్రజా సంక్షేమంలో భాగమైన మేనిఫెస్టోలోని అంశాలను వదిలేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్‌లు.. కేవలం రెడ్‌ బుక్‌పైనే దృష్టి పెట్టినట్లు ఉన్నారని అంబటి ఎద్దేవా చేశారు. ‘రెడ్ బుక్‌ని కాదు, మేనిఫెస్టోని అమలు చేయండి అంటూ తన ‘ఎక్స్‌’ హ్యాండిల్‌ వేదికగా అంబ‌టి రాంబాబు ట్వీట్‌ చేశారు.

Back to Top