వైయ‌స్ జగన్‌ హయాంలో అప్పు రూ.3 లక్షల కోట్లే! 

అసెంబ్లీ సాక్షిగా ఆధారాల‌తో అడ్డంగా బుక్కైన కూట‌మి ప్ర‌భుత్వం

అమరావతి :  వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే అంటూ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ప‌య్యావుల కేశ‌వ్ లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధానం ఇచ్చారు. దీంతో వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌భుత్వ‌ హయాంలో అప్పులపై చేస్తున్న అసత్య ప్రచారం, చంద్రబాబు కుట్ర.. అసెంబ్లీ సాక్షిగా బద్ధలైంది. రాష్ట్రాన్ని వైయ‌స్ జ‌గ‌న్ శ్రీ‌లంక చేశార‌ని, అప్పులు ఏకంగా రూ.14 లక్షల కోట్లంటూ ప్రచారం మొదలుపెట్టి.. ఇప్పుడు వైయ‌స్ జగన్‌ ప్రభుత్వం దిగిపోయేనాటికి రూ. 5,19,192 కోట్లు మాత్రమేనని తాజాగా ప్రకటించింది. గత రెండు ప్రభుత్వాల అప్పులపై వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నకు.. ఇవాళ ఆర్థిక మంత్రి పయ్యావుల లిఖితపూర్వక సమాధానం ఇవ్వడంతో అడ్డంగా దొరికిపోయారు.

2014 జూన్‌ 2 వ తేదీ నుంచి.. అంటే 2014-15 నుంచి  2023-24..  జూన్ 12వ తేదీ దాకా.. అలాగే 2024 డిసెంబర్ 31వ తేదీ దాకా ప్రభుత్వం, ప్రభుత్వ రంగల సంస్థల రుణాల వివరాలు తెలియజేయాలని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్‌, తాటిపర్తి చంద్రశేఖర్‌, ఆకేపాటి అమర్నాథ్‌, మత్స్యరస విశ్వేశ్వరరాజులు ఆర్థిక మంత్రి పయ్యావులను కోరారు.

వైయ‌స్ జగన్ హయాంలో చేసిన అప్పుల లెక్క ఇది

పబ్లిక్ అప్పులు రూ.2,34,225 కోట్లు. 

కార్పొరేషన్లు ద్వారా చేసిన అప్పులు  రూ. 1,05, 355 కోట్లు మాత్రమేనని ఆర్థిక శాఖ తెలిపింది.

మొత్తంగా వైయ‌స్ జగన్ ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులు రూ.3,39,580 కోట్లు మాత్రమే.

అలాగే గత ప్రభుత్వం(వైయ‌స్ఆర్‌సీపీ) దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని రాష్ట్ర ఆర్థిక శాఖ‌పేర్కొంది.

Back to Top