తాడేపల్లి: పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు,పవన్ కల్యాణ్ లతో పాటు పచ్చమీడియా విషం కక్కుతోందని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మండిపడ్డారు. ఈ కుట్రలకు అడ్డా నిమ్మగడ్డ రమేష్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పండుటాకుల మీద బిజేపి,టిడిపి,జనసేన కూటమి నేతలు క్రూరంగా వ్యవహరిస్తున్నారు పెన్షన్ లబ్దిదారులపై బ్యాంక్ ఖాతాల్లో వేయాలని నిమ్మగడ్డ రమేష్ చౌదరి లేఖ రాసింది నిజం కాదా. వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇవ్వొద్దని చెప్పి బ్యాంక్ ఖాతాల్లో వేయాలని నిమ్మగడ్డ స్వయంగా కోరారు. కూటమి నేతలు అంతా నిమ్మగడ్డ రమేష్ ద్వారానే కుట్రలకు అధ్యం పోశారు పురంధరేశ్వరి,చంద్రబాబు,పవన్ కళ్యాణ్ అంతా కలిసే నిమ్మగడ్డ రమేష్ తో ఈ వ్యవహారం నడిపారు. ఇప్పుడు అవేమి తెలియనట్లుగా డ్రామాలు ఆడుతున్నారు. పెన్సన్లు ఇంటివద్ద చెల్లించకుండా అడ్డుకుంది చంద్రబాబే అనేది రాష్ర్టంలోని ప్రతి ఒక్కరికి తెలుసు. గత రెండు రోజులుగా బ్యాంకుల వద్ద పండుటాకులు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం గత నెలలో పదుల సంఖ్యలో వృధ్దులు చనిపోవడానికి కారణం చంద్రబాబే. తిరిగి మేనెలలో కూడా చంద్రబాబు వృద్దుల ప్రాణాలతో పరాచకాలు ఆడుతున్నారు. పెన్షన్ల పంపిణీ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి మరణాలకు బాధ్యత అంతా కూటమిలోని మూడు పార్టీలదే. జగన్ గారిపై బురదచల్లుతున్న పచ్చమీడియా రమేష్ రాసిన లేఖలు,బ్యాంక్ అకౌంట్లలో పెన్సన్ వేయమన్న రమేష్ మాటలు గుర్తుకురావడంలేదా. కుట్రలకు గడ్డ నిమ్మగడ్డ రమేష్. ఎండవేడి గాలులకు,క్యూలలో నిలుచుని ఎవరైనా వృద్దులు మృతి చెందితే వారందర్ని చంద్రబాబు,రామోజిరావులే హత్య చేశారని భావిస్తాం.