షర్మిలకు ఏ అన్యాయం చేశామో.. ఆమె చెప్పాలి 

వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి 

ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా? 

వైయ‌స్ జగన్ కి చెల్లెలుగా, వైయ‌స్ఆర్‌కి కూతురిగా మాత్రమే షర్మిళ ప్రజలకు తెలుసు

కాంగ్రెస్ పార్టీ  వైయ‌స్ఆర్‌ ఫ్యామిలీని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసు

సీఎం వైయ‌స్ జగన్‌ని విమర్శించిన రోజే షర్మిలను ఎల్లోమీడియా భుజాన వేసుకుంది

ఇక్కడ అమలవుతున్న పథకాలు బీజేపీవా?

మణిపూర్ విషయం గురించి షర్మిళ పార్టీ తెలంగాణలో ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు?

 

బాబు స్క్రిప్టునే షర్మిల మాట్లాడుతుంది

వారి మధ్య ఏం ఒప్పందం జరిగిందో వాళ్ళే చెప్పాలి

తనకు ఏం అన్యాయం జరిగిందో షర్మిల చెప్పాలి

రాజకీయాలు కేవలం పదవులు పంచుకోవడం కోసం కాదు

వైయ‌స్ఆర్ ఫ్యామిలీని ఎంతగా వేధించారో షర్మిలకూ తెలుసు

వైయ‌స్ఆర్  పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే

వైయ‌స్ఆర్ స్కీంలు లేవంటే తీసుకుంటున్న వాళ్లంతా ఏవరు..?

వైయ‌స్ఆర్  ఆశయాలకు నాడు సమాధి కట్టాలని చూశారు

ఆయన ఆశయాలను సజీవంగా ఉంచేందుకే వైయ‌స్ జగన్ గారు పార్టీ  పెట్టారు.

మహానేత వైయ‌స్ఆర్‌కి, సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ గారే సరైన వారసుడు అనుకున్నారు గనుకే పట్టం కట్టారు:  సజ్జల రామకృష్ణారెడ్డి

సాక్షాత్తు మోడీ సభలోనే హోదా, విశాఖ స్టీల్‌పై జగన్‌ గారు గళమెత్తారు

వైయ‌స్ఆర్ టీపీ లో ఉన్నప్పుడు మణిపూర్‌పై షర్మిల మాట్లాడలేదెందుకు..?

వైయ‌స్ఆర్ పై రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యలను షర్మిల ఎందుకు ప్రశ్నించలేదు?

కోట్లాది మంది హృదయాలను టచ్‌ చేసినందుకు నా జన్మ ధన్యమైందనడంలో తప్పేముంది..?

వాచ్‌ ఇచ్చినట్లు ఎవరైనా చూశారా..సొల్లు వాగుడు వాగుతున్నారు..

రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకుండా గేమ్‌ ఆడాలని చంద్రబాబు చూస్తున్నాడు:  సజ్జల రామకృష్ణారెడ్డి. 

తాడేప‌ల్లి: తనకి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జగన్ ఏం అన్యాయం చేశారో షర్మిళ స్పష్టంగా చెప్పాల‌ని వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి డిమాండు చేశారు.  ప్రజాస్వామ్యంలో పదవులు అన్నీ కుటుంబానికే ఇస్తారా? అంటూ సజ్జల ప్రశ్నించారు. రాష్ట్ర రాజకీయాలపై షర్మిలకు అవగాహన లేదని.. ఆమె వ్యాఖ్యలకు పొంతన ఉండడం లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, షర్మిల మాట్లాడిన ప్రతీ దానికి సమాధానం చెప్పాల్సిన పనిలేదన్నారు. షర్మిల హఠాత్తుగా ఏపీలో అడుగుపెట్టారు. రావటమే మాపై వ్యంగ్యాస్త్రాలు వేస్తున్నారు. ఆమెకి ఇక్కడి రాజకీయాలపై అవగాహన లేదు. వైఎస్సార్ పథకాలను తుంగలో తొక్కింది కాంగ్రెస్ పార్టీనే. వైయ‌స్ జగన్ కి చెల్లెలుగా, వైయ‌స్ఆర్‌కి కూతురిగా మాత్రమే షర్మిళ ప్రజలకు తెలుసు. కాంగ్రెస్ పార్టీ  వైయ‌స్ఆర్‌ ఫ్యామిలీని ఎంతగా వేధించిందీ షర్మిలకు తెలుసు అని గుర్తు చేశారు. గురువారం స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.

సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే:

– షర్మిల అకస్మాత్తుగా రాష్ట్రంలో రాజకీయ తెరమీద ప్రత్యక్షం అయ్యారు. 
– రావడం రావడమే తన మార్క్ కోసం విమర్శలు, వ్యంగాస్త్రాలకు పూనుకున్నారు. 
– ఆమె మాట్లాడిన ప్రతి ఒక్క దానికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. 
– ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, రాజకీయాల గురించి కానీ ఆమెకు ఏ మాత్రం అవగాహన ఉన్నట్లు కనిపించడం లేదు. 
– అందుకే ఆమె మాట్లాడే మాటల్లో ఒకదానికి మరో దానికి పొంతన ఉండటం లేదు. 
– నాకైతే ఒక  కాంపిటీషన్‌ పరీక్షకు బట్టీ పట్టి ప్రిపేర్‌ అయ్యి పిల్లలు వచ్చి మాట్లాడుతున్నట్లు ఆమె ప్రసంగం కనిపిస్తోంది. 
– కుటుంబం గురించి ముఖ్యమంత్రి అన్న కాంటెస్ట్‌ వాస్తవం. రాజశేఖరరెడ్డి ఆశయాలను తుంగలో తొక్కి, ఆయన పథకాలు పక్కన పెట్టారు. 
– ఆయన మరణం వల్ల మరణించిన కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు చేపడితే అడ్డంగా నో చెప్పారు. 
– దాని తర్వాత కక్ష సాధింపు మొదలు పెట్టి వేధించిన విషయం షర్మిలమ్మకు కూడా తెలుసు. 
– సోనియా గాంధీని కలిసినప్పుడు వైయ‌స్ జగన్‌, వైయ‌స్ విజయమ్మ, షర్మిలమ్మ..ముగ్గురే ఉన్నారు. అక్కడేం జరిగిందో కూడా ఆమెకు తెలుసు. 

వైయ‌స్ జగన్‌ వైఎస్సార్‌కి సరైన వారసుడు అనుకున్నారు గనుకే పట్టం కట్టారు:
– అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు కాకూడదు అని ఏవరూ అనరు. 
– వైయ‌స్‌ జగన్‌ మాట్లాడిన కాంటెస్ట్‌ మాత్రం ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టగానే వివేకానందరెడ్డిని పోటీపెట్టడం, మంత్రి ఇవ్వడం అందరూ చూశారు. 
– కానీ ప్రజలు వైయ‌స్ జగన్‌ సరైన వారసుడు అనుకున్నారు..వైఎస్ఆర్సీపీకి పట్టం కట్టారు. 
– షర్మిల ఏపీలో రాజశేఖరరెడ్డి బిడ్డగా, వైయ‌స్‌ జగన్‌ చెల్లిగా తెలుసు. 
– వైయ‌స్‌ జగన్‌ వైఎస్సార్‌ బిడ్డగా ఆ రోజు మొదలు పెట్టిన ప్రస్థానం.. నేడు ఉధృతమైన ప్రవాహంలా ముందుకు సాగుతోంది. 
– దానికి కారణం రాజశేఖరరెడ్డి ఆశయాలను, ఆలోచనలను వైయ‌స్ జగన్‌ మనసా వాచా నమ్మి వాటిని మరింత ఫైన్‌ ట్యూన్‌ చేసి ఇంప్లిమెంట్‌చేస్తున్నారు. 
– పార్టీని నడపడం కావచ్చు.. విలువలను పాటించడం, నిజాయితీ, నిబద్దతతో వ్యవహరించడం, నిబ్బరంగా అడుగు వేయడంలో ఎన్ని ఆటుపోటులైనా తట్టుకోవడం కావచ్చు.. వైయ‌స్‌ జగన్ అన్నింటా వైఎస్సార్‌ అడుగుజాడల్లో నడుస్తున్నారు. 
– ఆ నాడు అక్రమ కేసుల్లో జైళ్లో పెట్టడం నుంచి చంద్రబాబు 23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్లు కొన్నప్పుడు కూడా ఎక్కడా చలించలేదు. 
– ఆ రకంగా సొంతగా ఎదిగిన వ్యక్తి వైయ‌స్ జగన్‌. వైయ‌స్‌ జగన్‌ తండ్రి రాజశేఖరరెడ్డి అని చెప్పుకోవడం అంటే ఏ తండ్రికైనా గర్వకారణమే. 
– దాంట్లో భాగంగానే షర్మిలమ్మ ఇక్కడకు వచ్చింది, ఎవరన్నా ఆమెను గుర్తించినా రాజశేఖరరెడ్డి గౌరవం వల్ల వచ్చిందే. 
– ఎవరూ కాదనడం లేదు...రాజశేఖరరెడ్డి బిడ్డ.. వైయ‌స్‌ జగన్‌ చెల్లెలుగా ఆమెకు ఇచ్చే గౌరవం అభిమానులు ఇస్తారు. గుండెల్లో పెట్టుకుంటారు. 

ఏం అన్యాయం జరిగిందో ఆమే చెప్పాలి:
– ఇంత శ్రమ పడితే నాకు అన్యాయం జరిగింది అంటున్నారు. ఏం అన్యాయం జరిగిందో ఆమె స్పష్టంగా చెప్పాలి. 
– పదవుల పంపకంలో అన్యాయం చేశారా? కుటుంబం పదవులు పంచుకోడానికి ఉందా? అది సబబేనా? 
– అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా? అది చర్చించడానికి కూడా అర్హమైనదేనా? 
– అలాంటప్పుడు అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది? రాజకీయ పార్టీ ఎలా అవుతుంది? 
– ఒక సారి మొదలు పెట్టిన తర్వాత రాజకీయ పార్టీ తన స్వరూపాన్ని తాను తీసుకుంటుంది. 
– అందులో పునాదులు పడ్డ దగ్గర నుంచి ఉన్నవాళ్లు ఉంటారు..మధ్యలో జాయిన్‌ అయిన వారుంటారు. 
– ఎంత బలంగా కొత్త ఆలోచనలను తీసుకోగలగుతుందో అంత కాలం అది నిలబడుతుంది. 
– ఉదాహరణకు వైఎస్సార్టీపీ తీసుకోండి. అక్కడ కూడా ఆ పార్టీ కోసం చాలా మంది కష్టపడి ఉంటారు కదా..వారికి ఏం న్యాయం చేశారు? 
– వారి భవిష్యత్తు గురించి ఏం ఆలోచన చేశారు..ఏ రాజకీయ పార్టీలోనైనా అది కుదురుతుందా? 
– పదవి కోసమే ఆమె ఆ రోజు అన్నకోసం నిలబడి చేశారా అనేది కూడా స్పెసిఫిక్‌గా చెప్పగలిగితే జవాబు ఇవ్వొచ్చు. 
– ఆమెకు ఏం అన్యాయం చేశారు..? ఏం అన్యాయం జరిగిందో చెప్పాలి. 
– ఆ రోజు అందరూ కష్టపడ్డారు. లక్షలాది మంది కార్యకర్తలు కదిలారు..త్యాగాలు చేశారు. 
– ఆయన కూడా స్వయంగా ఇబ్బంది పడ్డారు..16 నెలలు జైళ్లోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది? 
– ఆనాడు కాంగ్రెస్‌ హైకమాండ్‌ వాళ్లు డిక్టేట్‌ చేసినట్లు ఊ కొట్టి ఉంటే...ఆయన కేంద్ర క్యాబినెట్‌లోకి వెల్లేవారు. ఆ తరవాత సీఎం అయ్యేవారు. 
– ఏం ఆయనకు ఆస్తులు లేవా? బతకలేకనా? ఓదార్పు యాత్ర వద్దన్న అంశంపైనే వైయ‌స్ జగన్ డిఫర్‌ అయ్యారు. 
– ఓదార్పు యాత్ర వద్దనడంలోనే వాళ్లు రాజశేఖరరెడ్డి ఆశయాలకు సమాధి కట్టాలని చూస్తున్నారనేది స్పష్టమైంది. 
– వాటిని సజీవంగా ఉంచాలి..ఆచరణలోకి తీసుకురావాలనే ఉద్ధేశం ఆయన కాంగ్రెస్ నుంచి బయటకు రావడంలో ఇమిడి ఉంది. 
– రాజశేఖరరెడ్డిని ప్రేమించిన ప్రతి గుండె..ఆయనలో ఉన్న కరుణ, మానవత్వం..మంచి పరిపాలకుడు అనే నమ్మకం. 
– నేను ఆయన బిడ్డగా అవన్నీ ఇవ్వాలని వైయ‌స్‌ జగన్‌ అనుకున్న భావన ఓదార్పు యాత్రలో ఉంది. 
– యాత్ర కొనసాగించిన తర్వాత కక్షసాధింపు ఎంత దూరం వెళ్లిందో అందరూ చూశారు. 
– సొంత బాబాయిని పక్కకు తీసి ప్రలోభ పెట్టి మంత్రి పదవి ఇచ్చారు. పులివెందులలో విజయమ్మ పైనే పోటీ పెట్టారు.  
– పార్టీ పెట్టిన తర్వాత ఆ కక్షసాధింపు ఎంతదూరం పోయిందో తెలుసు. 16 నెలలు అక్రమంగా జైళ్లో పెట్టారు. ఆ కేసులు నేటికీ నడుస్తూనే ఉన్నాయి. 
– ఆ కేసులు అక్రమమైనవని ఆ పార్టీ నాయకులే పదేపదే చెప్పారు. 
– ప్రస్తుతం రాజకీయాల్లోకి వచ్చిన అప్పటి జేడీ లక్ష్మీనారయణ కూడా దాని తీవ్రత, స్వరూపం ఎంతో చెప్పారు. 
– ఇందులో అసలు కేసే లేదు..రామోజీరావు షేర్లు రూ.5.30 లక్షలు వెళ్లినప్పుడు సాక్షి షేర్‌ రూ.360కు పోవడంలో ఏ రకమైన స్కాం ఉంది..? 
– ఇచ్చిన వాడు, కొనేవాడు అగ్రిమెంట్‌తో షేర్‌ ట్రాన్స్‌ఫర్‌ అయి ఫిజికల్‌ అసెట్స్‌ ఉండి, రోజూ పత్రిక లక్షలాది కాపీలు వస్తుంటే అందులో అక్రమమేముంది? 

పార్టీ ఎదుగుదలలో లక్షలాది మంది కార్యకర్తల పాత్ర కూడా ఉంది:
– ఆ రోజు వైయ‌స్ జగన్ అంతుచూడాలని కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రయత్నాలు అన్నీఇన్నీ కావు. 
– నేలకు కొట్టిన బంతిలా వైయ‌స్‌ జగన్‌ కూడా పైకి ఎదిగారు. అందులో లక్షలాది కార్యకర్తలు, వైఎస్సార్‌ అభిమానులు, నాయకులు అడుగులో అడుగు వేశారు. 
– అందులో అందరి పాత్ర ఉంది. షర్మిల పాత్ర ఉంది..వైయ‌స్‌ విజయమ్మ పాత్ర ఉంది..ఏదో ఒక లెవల్‌లో అందరిదీ ఉంటుంది. 
– అలా పాత్ర ఉండబట్టే పార్టీ ఈనాటికీ నడుస్తోంది. 
– రాజకీయ పార్టీగా ఒక వ్యవస్థ తయారయ్యాక..అధికారంలోకి వచ్చి నిలబడ్డాక అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. 
– అందులో అత్యంత పారదర్శకంగా న్యాయం చేసిన పార్టీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ. 
– అందుకే ఈ రోజుకీ కార్యకర్తలు, నాయకులు ఆయనతో అచంచల విశ్వాసంతో అడుగులు వేస్తున్నది. 

వైఎస్సార్‌ స్కీంలు లేవంటే తీసుకున్న వాళ్లంతా ఎవరు?:
– తనకు అన్యాయం జరిగినా సరే..రాజశేఖరరెడ్డి ఆశయాలు అమల్లోకి రాలేదు అంటున్నారు. 
– అది విన్నాక ఏమనాలో అర్ధం కావడం లేదు. బహుశా ఆమెకు తెలియకపోయి ఉండొచ్చు. 
– స్క్రిప్ట్‌ చంద్రబాబు, ఏబీఎన్‌ రాధాకృష్ణ వద్ద నుంచి వచ్చినప్పుడు...దాన్ని బట్టీ పట్టి చెప్పినప్పుడు వాస్తవాలు ఆమెకు తెలిసి ఉండకపోవచ్చు. 
– ఆమె ఎంత వరకూ పోతున్నారంటే..ఆనాడు వైఎస్సార్‌ ఫీజు రీఎంబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, రైతు భరోసాలు లేవంటున్నారు. 
– రైతులకు సంబంధించి నేడు ఇస్తున్నంత భరోసా ఎక్కడైనా ఉందా? 
– అసలు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ లేదంటున్నారు..తీసుకున్న రైతులంతా ఏమనుకుంటారు..? 
– ఇంత అబద్ధం పాపం తెలియక మాట్లాడి ఉండొచ్చు..ఎందుకంటే స్క్రిప్ట్‌లో ఇచ్చింది మాట్లాడి ఉండొచ్చు. 
– బహుశా చంద్రబాబు కూడా వీటిపై మాట్లాడటానికి సాహసం చేయకపోవచ్చు. 
– మహా అయితే.. నా చంద్రన్న కానుకలు లేవు అనొచ్చు కానీ.. ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు లేవని మాత్రం అనలేడు. 
– ఇంత అడ్డగోలు అబద్ధమైతే చంద్రబాబు కూడా ఆడి ఉండడు. 
– షర్మిలమ్మే తిట్లు తింటుందిలే అని చంద్రబాబు కూడా ఆ తప్పుడు స్క్రిప్ట్‌ రాసిచ్చి ఉండొచ్చు. 
– నాడు వైఎస్ఆర్ అమలు చేసిన  ఆయా పథకాలకు మరింత పదును పెట్టాం. ఆరోగ్యశ్రీ ఆరోజుతో పొలిస్తే 3వేలకు పైగా ప్రొసీజర్స్‌ పెంచారు. 
– రూ.25 లక్షల వరకూ పరిమితి పెంచారు..అర్హత కోసం రూ.5 లక్షలు ఆదాయం చేశారు. 90 శాతం కుటుంబాలు కవర్‌ అవుతున్నాయి. ఇవి నిజం కాదా? 
– ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఆనాడు రూ.30–35 వేలు ఇస్తుంటే ఇప్పుడు వంద శాతం చెల్లిస్తున్నది వాస్తవం కాదా? 
– ఏదైనా తీసుకోండి..రాజశేఖరరెడ్డి పథకాలు ఎక్కడ మర్చిపోయారు..? 
– కేవలం వైయ‌స్ జగన్‌ చెల్లెలు, రాజశేఖరరెడ్డి బిడ్డ అనే ఏకైక అర్హతతో ఇక్కడకు సోనియా గాంధీ తెచ్చి ఈ పోస్టు ఇచ్చింది. 
– రోజు రోజుకు అబద్ధాలతో ఎటాక్‌ పెంచుతున్నారు. వీటన్నింటినీ ప్రజలు గమనించాలి. 

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై స్పందించలేదెందుకు..?:
– తెలంగాణలో రెండున్నరేళ్లపాటు వైఎస్సార్‌ తెలంగాణ పార్టీని నడిపినట్లున్నారు. 
– పార్టీ పెట్టినప్పుడు మీడియా మమ్మల్ని అడిగితే విష్‌ హర్‌ ఆల్‌ ది బెస్ట్‌ అనే చెప్పాం. 
– వైఎస్సార్‌ బిడ్డగా, వైయ‌స్ జగన్‌ చెల్లిగా సక్సెస్‌ అయితే హ్యాపీగానే ఫీలవుతాం అని చెప్పాం. 
– కారణాలు ఏమైనా కానీ ఆ జర్నీ సడన్‌గా కట్‌ అయ్యింది. 
– ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను భుజానికి ఎత్తుకుని మోస్తుందో...ఆ ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ5లు ఏ రోజైతే వైయ‌స్ జగన్‌పై బాణాలు ఎక్కుపెడతారో దాన్నే హైలెట్‌ చేస్తారు. 
– తెలంగాణలో కూడా ఆమె అంత చేస్తే వైయ‌స్ జగన్‌ని అన్న వాటిని మాత్రమే హైలెట్‌ చేశారు. 
– ఆఖరున కాంగ్రెస్‌ ఆమెను అడగకపోయినా ఆమె అంతట ఆమే స్వచ్ఛందంగా పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటన చేశారు. 
– ఫలితాలు వచ్చాక నీ వల్ల మాకు మేలు జరిగింది అని ఎవరైనా ఆమెకు థాంక్స్‌ చెప్పారా? 
– సరే..ఈ మీడియా అయినా, త్యాగం చేసిన షర్మిలను కాంగ్రెస్‌ గుర్తించలేదు అని రాశారా? అంటే అదీ లేదు.  
– అసలు తెలంగాణలో ఆమె ఇర్రెలవెంట్‌ ఎందుకు అయ్యారు..ఆనాడు కాంగ్రెస్‌ను తిట్టారు..ఆఖరుకు ఆ పార్టీలోనే కలిశారు. 
– పార్టీ మూసేసిన తర్వాత ఆమె కాంగ్రెస్‌ పక్షాన టీఆర్‌ఎస్‌ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఎందుకు తిరగలేదు? 
– న్యాయమైన పోరాటం ఉన్నదన్నప్పుడు ఆమె తన రోల్‌ ఎందుకు ప్లే చేయలేదు..? 
– ఈ మధ్య కూడా రేవంత్‌రెడ్డి కూడా  ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ రాజశేఖరరెడ్డి ఆనాడు వలసలను ప్రోత్సహించారని..దానివల్ల పకృతి గుణపాఠం చెప్పింది అన్నట్లు మాట్లాడారు.  
– అలా అన్నప్పుడు అలాంటి పార్టీలో ఉండి మీరు ఎందుకు మాట్లాడలేకపోయారు? 
– బహుశా ఈ రోజు మాట్లాడింది చూస్తే...ఆమె ఏ స్టేట్‌లో ఉండి మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. 
– ఆమె తెలంగాణాలోనే ఉండి మాట్లాడుతున్నాను అనుకుంటున్నారేమో..

ఏం ఆశించి ఆమెకు అశాభంగం కలిగిందో చెప్పాలి:
– తనకు అన్యాయం జరిగింది అన్నప్పుడు ఏం ఆశించి ఆమె తన అన్న కోసం తిరిగారో చెప్పాలి.
– ఏం ఆశించి ఆశాభగం కలిగిందో కూడా చెప్పాలి. రాజకీయాలనేవి పదవులను కుటుంబంలో పంచుకోడానికేనా అనేది కూడా చెప్పాలి. 
– ప్రజాస్వామ్యయుతంగా పార్టీ నడపడం ఆదర్శప్రాయంగా ఉందా లేదా అనేది ముఖ్యం. 
– ప్రజలు ఒక రాజకీయ పార్టీని ఎన్నుకునేది మంచి చేస్తారని..దాని అధినేతగా ఆయన ఆలోచనలు పరిపాలనలో, పార్టీలో ప్రతిబింబిస్తాయి. 
– పార్టీని ఆరోగ్యకరంగా ఉంచడానికి బంధాలకు అతీతంగా నడపడం ఆదర్శప్రాయం. 
– అది వద్దని ఆమె అనుకుంటున్నారా..దాంట్లో నాకు ఇంత వాటా రావాలి..రాలేదు అంటున్నారా అనేది కూడా చెప్పాలి. 

సాక్షాత్తు మోడీ సభలోనే హోదా, విశాఖ స్టీల్‌పై వైయ‌స్ జగన్‌ గళమెత్తారు:
– వైఎస్సార్సీపీ..బీజేపీకి ఒక టూల్‌లా మారింది..వారికి రాష్ట్రాన్ని అప్పజెప్పింది అని షర్మిల ఆరోపణలు చేశారు. ఏరకంగానో చెప్పాలి. ఇక్కడున్న పథకాలు బీజేపీవా? ఇక్కడి ఆలోచనలు బీజేపీవా? 
– స్టీల్‌ ప్లాంట్‌ విషయం కేంద్రానికి సంబంధించింది. మేం కేంద్రాన్ని కన్విన్స్‌ చేసే ప్రయత్నం చేస్తున్నాం. 
– వైయ‌స్ జగన్‌ అందరికంటే ముందు రియాక్ట్‌ అయ్యారు.  మేం ముందుగానే లేఖ కూడా రాశాం. 
– వారి అప్పులను రీస్ట్రక్చర్‌ చేయడం, అదనంగా ఉండే భూమిని అమ్మి ఆ సొమ్ముతో నష్టాలను తగ్గించుకోవాలని కూడా కోరాం. 
– ఇది వ్యాపారం కాదు...సెంటిమెంట్‌కు సంబంధించినదని కూడా చెప్పాం. 
– ఇంతకు మించి వేరే రకమైన పోరాటం ఎవరైనా చేయగలరా? 
– ప్రధాని ఉన్న వేదికపైనే విశాఖ స్టీల్స్, ప్రత్యేక హోదా గురించి వైయ‌స్‌ జగన్ గళమెత్తారు. 
– మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేక ఇంకేదైనా ఉందా? 
– పోరాటం అంటే నిర్వచనం, స్వరూపం ఎలా ఉండాలో ఆమే చెప్పాలి. 
– రాజకీయ పార్టీగా విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేయడానికి వైఎస్సార్సీపీ అనుకూలంగా ఉందంటూ ఎవరైనా స్టేట్‌మెంట్‌ ఇస్తే అభ్యంతరం చెప్పొచ్చు. 
– గంగవరం పోర్టు విషయంలోనూ అలానే మాట్లాడారు. గంగవరం పోర్టులో మనకున్న వాటా బదులుగా వచ్చిన రూ.600 కోట్లు, మిగిలిన మూడు పోర్టుల అభివృద్ధికి వినియోగిస్తున్నాం. 
– రెండోది దానివల్ల మా హక్కును కోల్పోలేదు. 33 ఏళ్ల తర్వాత మళ్లీ అది ప్రభుత్వానికే వస్తుంది. 
– ఇది కాక కొంత రెవిన్యూ షేరింగ్‌ కూడా ప్రభుత్వానికి వస్తుంది. 
– ఒక పెద్ద సంస్థ వచ్చి ఆపరేషన్స్‌ చేస్తే రాష్ట్రానికి రెవిన్యూ పెరుగుతుంది. 
– ప్రపంచం మొత్తం ఇలానే చేస్తోంది. ఇప్పుడు టేకప్‌ చేసిన సంస్థ ఈ రంగంలో నిపుణత కలిగిందే. 
– ఇలా ఆలోచించడంలో తప్పేముంది..? ఆమె టక్కున ఒక మాట అనేస్తే తలా తోక ఉన్న స్టేట్‌మెంటేనా? 

వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడు మణిపూర్‌పై మాట్లాడలేదెందుకు..?:
– మణిపూర్‌ అంశం షర్మిలమ్మ వైఎస్సార్టీపీలో ఉన్నప్పుడే జరిగింది. అప్పుడెందుకు ఆమె మాట్లాడలేదు? 
– అప్పుడు ఆమె ఎజెండాలో ఇది ఎందుకు లేదు? అక్కడెందుకు పోరాటం చేయలేదు? 
– ఇక్కడకు రాగానే బీజేపీ, మణిపూర్‌ అంటూ క్రిస్టియన్లకు అన్యాయం జరిగిందనడంలో అంతర్యం తెలియడం లేదా? 
– ఇదంతా ఆమె అనుకున్నది కాదు..చంద్రబాబు అనుకున్నది. 
– ప్రభుత్వ వ్యతిరేక ఓటు గంపగుత్తగా ఆయనకు రావాలి..అలాగే వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్న మైనార్టీలు, క్రిస్టియన్లు, దళితుల ఓట్లు కోసం మాత్రమే ఆమెను తీసుకొచ్చారు. 
– అందుకే ఆమెతో అవే మాటలు మాట్లాడిస్తున్నారు. అవే పలుకులు ఆమె మాట్లాడుతున్నారు. 
– చంద్రబాబు కంట్రోల్‌లో సాగుతున్న దుష్ప్రచారం తప్ప ఈమె మాత్రం కేవలం చిన్న పావు మాత్రమే. 

హృదయాలను టచ్‌ చేసినందుకు నా జన్మ ధన్యమైందనడంలో తప్పేముంది..?:
– వైయ‌స్ జగన్‌ది విలక్షణమైన వ్యక్తిత్వం. ఆయన ఏదీ తన హక్కు అనుకోరు. 
– చంద్రబాబు అధికారం తన హక్కు అనుకుంటాడు. తనెప్పుడు బాధ్యతతో అధికారంలోకి రాలేదు కాబట్టి. 
– అందుకే ఆయన అధికారంలోకి రాగానే.. మరో 50 ఏళ్ళ తర్వాత 2075లో ఏం చేస్తాడో ఇప్పుడే చెప్తుంటాడు. 
– కానీ మన రాజ్యాంగం ప్రకారం ప్రజలు ఐదేళ్లకే అధికారం ఇచ్చారు. ఆ స్పృహ వైయ‌స్‌ జగన్‌కి ఉంది. 
– ఎప్పుడైనా ప్రజలే నిర్ణేతలు అని ఆయన గట్టిగా నమ్ముతారు. ఐదేళ్ల తర్వాత ఫ్రెష్‌గా వెళ్లాలి..ప్రజల దీవెనలు కోరాలి. చెప్పుకోవాలని భావిస్తారు. 
– ఇండియా టుడే రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఇంటర్వ్యూలో ఏమడిగాడు..? మీకిది సంతృప్తినిస్తోందా అని అడిగారు..దానికి భావోద్వేగంతో వైయ‌స్‌ జగన్‌ రియాక్ట్‌ అయ్యారు. 
– నాలుగున్నరేళ్ళ తన పాలనలో ఇన్ని కోట్ల మంది హృదయాలను టచ్‌ చేసినందుకు నా జన్మ ధన్యమైందని చెప్తూ...ఒకవేళ తప్పుకోవాలన్నా పూర్తి సంతృప్తితో చేస్తాను అన్నారు. 
– ఎవరు ఇలా అనగలరు..ఒక మహా స్థితిప్రజ్ఞుడు మాత్రమే అనగలడు. 
– ఇప్పటికి 75 ఏళ్లలోనూ ఎలా ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకోవాలి అనుకునే చంద్రబాబు అయితే ఈ మాట అనలేడు. 
– నేనేం చేయగలిగాను...అని చెప్పుకోడానికి వైయ‌స్‌ జగన్‌కి ఎంతో ఉంది. ఆ తృప్తినే వారు వ్యక్తీకరించారు. 
– దానికి ఓ చిల్లర భావాన్ని ఇచ్చి సంతోషిస్తే ఏం చేయలేం. 
– ఇప్పుడే కాదు..రాబోయే 30 ఏళ్లు నేనే ఉంటాను అంటే చెల్లుతుందా ప్రజాస్వామ్యంలో? 
– వినయంతో, వినమ్రతతో ప్రజలే నిర్ణేతలు అని గుర్తించిన ఒక మంచి నాయకుడు మాట్లాడగలిగిన మాటే వైయ‌స్‌ జగన్‌ మాట్లాడారు. దాని భావం అలానే ధ్వనిస్తుంది. 
– అలా కాదనుకునే వారు రెండు రోజులు భ్రమల్లో ఉండటానికి ఉపయోగపడుతుంది తప్ప ఏమీ ఉండదు. 

చేసింది ప్రచారం చేసుకోవడంలో తప్పేముంది..?:
– ప్రజలకు చేసినవన్నీ చెప్పుకోవడం అందరూ చేసేవే. విద్యారంగంలో మేం తీసుకొచ్చిన సంస్కరణలు చెప్పుకుంటున్నాం. 
– మేం చేసింది చెప్పుకోడంలో తప్పేముంది? చంద్రబాబులా నవనిర్మాణ దీక్షలంటూ ప్రభుత్వ సొమ్ము ఖర్చు పెట్టడం లేదు. 
– మనం ఏం చేశామో ప్రపంచానికి తెలియాలని ఇండియా టుడే కాంక్లేవ్‌ కు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. 
– చంద్రబాబులా పొలవరం పూర్తి చేయకుండానే బస్సులు పెట్టి ప్రజల్ని తోలి..పాటలు పాడించుకునేందుకు ఖర్చు చేయలేదు. 
– జగనన్న వదిలిన బాణం తిరిగి వైయ‌స్‌ జగన్‌ మీదకే వచ్చిందన్నప్పుడు చంద్రబాబు ఎందుకు ఇక మాట్లాడటం? తనపని తాను చూసుకోవచ్చు కదా? 
– ఆయన మాటతో సహా అన్నీ ఈమె నోట్లోంచే ఎలా వస్తున్నాయి..వారి మధ్య ఏం ఒప్పందం కుదిరింది? 
– ఏబీఎన్‌ రాధాకృష్ణ నిరంతరం ఏ రకంగా మానిటర్‌ చేస్తున్నాడు..వాళ్ల పేపర్లో ఎందుకంత కవరేజ్‌ వస్తోంది? 
– సడన్‌గా ఈ మాటలన్నీ ఎలా వచ్చాయి..మాకు సబంధం లేదంటే వీటికి సమాధానం చెప్పాలి. 
– న్యాయమూర్తులకు వాచ్‌ ఇచ్చినట్లు ఎవరైనా చూశారా..సొల్లు వాగుడు వాగుతున్నారు..
– ఆ చానల్‌..దాన్నినమ్ముకుని నడుస్తున్న టీడీపీకి కానీ..వాళ్లకు ఈ ప్రజల సమస్యలేంటి..రాష్ట్రానికి ఏం కావాలనే స్పృహ మాత్రం లేదు. 
– వాళ్లకు వాళ్లే రాసుకోవడం...వాళ్లే సవాళ్లు విసరడం తప్ప ఏమీ ఉండదు. 
– నరసరావుపేట ఎంపీ సీటు బీసీకి ఇవ్వాలనుకున్నాం. ఆయన్ను గుంటూరు వెళ్లమని చెప్పాం. 
– ఆయనకు అక్కడే కావాలన్నారు...వ్యక్తిగత నిర్ణయం తీసుకున్నాక ఇక మేమేం మాట్లాడతాం? 
– నచ్చచెప్పడానికి, అందర్నీ కలుపుకుపోవడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని కుదురుతాయి..కొన్ని కుదరవు. 
– రాజకీయాల్లో ఇవన్నీ సహజం. మా వైపు నుంచి మేం ముందే అభ్యర్థుల మార్పులు చేర్పులు మొదలుపెట్టాం..కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. 
– ప్రజలకు మేం ఒక స్పష్టమైన పిక్చర్‌ ఇస్తున్నాం. 
– అక్కడ పొత్తు ఎవరో తెలియదు..ఒకరు 70 సీట్లు అంటారు..ఈయన 30 కంటే ఇవ్వను అన్నాడంటారు. 
– చంద్రబాబు...పవన్‌ ఇచ్చినవి పక్కన పడేశాడు అంటారు..
– ఓట్లు చీల్చడానికి కాంగ్రెస్‌ వారిని ఎక్కడ నిలబెడతాడో తెలియదు. 
– మున్ముందు వాళ్ల రాజకీయం రంజుగా ఉంటుంది...
– మార్పు ఉందంటే ఉంది..చెప్పలేదంటే మార్పు లేనట్లే. 
– వైయ‌స్ జగన్‌ టీం సిద్ధమైంది...నిర్మాణాత్మకంగా ఎన్నికలు వెళ్తున్నాం. 

రాజ్యసభ ఎన్నికల్లో బలం లేకుండా గేమ్‌ ఆడాలని చంద్రబాబు చూస్తున్నాడు:
– కొంతమందికి టిక్కెట్లు ఇవ్వనందువల్ల వారిని లోబరుచుకోవాలని టీడీపీ ప్రయత్నం చేస్తోంది. 
– దుర్మార్గమైన, వికృతమైన ఆలోచనలు పెట్టుకుని నంబర్‌ లేకుండా ఎందుకు గేమ్‌ ఆడాలనుకుంటున్నారో వాళ్లు సమాధానం ఇవ్వాలి. 
– రాజకీయ పార్టీలో టికెట్ల మార్పులు ఉండవా..? వారిని ఎలా ఉపయోగించుకోవాలో మేం చూసుకుంటాం. 
– కానీ దొంగతనం చేసి వారిని లాక్కోవాలనే ప్రయత్నాలు చంద్రబాబు చేయకుండా ఉంటే ప్రజాస్వామ్యం బాగుంటుంది కదా? 
– టీడీపీకి ఒక సీటు తెచ్చుకోడానికి తగినంత సంఖ్యాబలం ఉంటే పోటీ పెట్టుకోవచ్చు. 
– ఒకటో రెండో ఉన్నా ఆశ పెట్టుకుని లాక్కున్నారు అనుకున్నా సరే..అసలు దగ్గర్లోనే లేకుండా పోటీ పెట్టాలని అనుకుంటున్నారు. 
– గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించడం పూర్తిగా స్పీకర్‌ విచక్షణాధికారం. 

Back to Top