17వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం

తూర్పుగోదావ‌రి జిల్లా: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి చేప‌ట్టిన `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర 17వ రోజు తేత‌లి రాత్రి బస ప్రాంతం నుంచి ప్రారంభ‌మైంది. తేత‌లిలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. జ‌న‌నేత‌కు గ‌జ‌మాల‌తో, పూల‌వ‌ర్షంతో ఘ‌న‌స్వాగ‌తం ప‌లికారు. 17వ రోజు బ‌స్సు యాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ మీదగా పొట్టిలంక చేరుకుంటుంది. పొట్టిలంక‌లో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ భోజ‌న విరామం తీసుకుంటారు. అనంతరం కడియపులంక, వేమగిరి, మోరంపూడి జంక్షన్, తాడితోటజంక్షన్, చర్చిసెంటర్, దేవిచౌక్, పేపర్‌ మిల్‌ సెంటర్, దివాన్‌ చెరువు, రాజానగరం మీదుగా ఎస్‌టీ రాజపురం వద్ద రాత్రి బస శిబిరానికి సీఎం చేరుకుంటారు.

Back to Top