వైయ‌స్‌ జగన్‌పై చంద్రబాబు విష  ప్రచారం

వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి
 

తిరుపతి: రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు సాక్షాత్తూ శ్రీవారిని అడ్డం పెట్టుకున్నారని వైయ‌స్ఆర్‌సీపీ అధికార ప్ర‌తినిధి భూమన క‌రుణాక‌ర్‌రెడ్డి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ..వైయ‌స్‌ జగన్‌పై చంద్రబాబు విష  ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

శ్రీవారి మహా ప్రసాదంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. లడ్డూ ప్రసాదంపై ఆరోపణలు చేసి చంద్రబాబు తప్పు చేశారు. నీచ రాజకీయాలు చేసేందుకు కూడా చంద్రబాబు వెనుకాడ లేదు. సీబీఐ, సుప్రీంకోర్టు జడ్జితో విచారణకు సిద్ధమేనా?. శ్రీవారికి కళంకం అంటగడుతున్నారు. వైయ‌స్ జగన్‌ను రాజకీయంగా అంతం చేసేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నార‌ని కరుణాకర్‌రెడ్డి నిప్పులు చెరిగారు.

లడ్డూ వ్యవహారంపై ప్రధాని కూడా స్పందించాలి. నీచమైన  రాజకీయం కోసం ఆరోపణలు చేస్తే అంతా శ్రీవారే చూసుకుంటారు. చంద్రబాబు ఆరోపణలు నిజమైతే.. లడ్డూలో కల్తీ నెయ్యి కారకులు రక్తం కక్కుకుని చనిపోవాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా. శకుని బతికుంటే చంద్రబాబును చూసి ఏడ్చేవారు. నెయ్యిలో వెజిటేబుల్‌ ఫ్యాట్‌ కలిసిందని గతంలో టీటీడీ ఈవో చెప్పలేదా?. చంద్రబాబు బెదిరించిన తర్వాత ఈవో మాట మార్చార‌ని భూమన గుర్తు చేశారు.

Back to Top