రేపు పులివెందులకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

అమ‌రావ‌తి: వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి రేపు వైయస్ఆర్‌ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్ళనున్నారు. రేపు (31.08.2024) ఉదయం 11 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గంలో మాచునూరు వెళతారు, ఆ తర్వాత అక్కడి నుంచి గొందిపల్లె చేరుకుంటారు, అక్కడి నుంచి పులివెందుల బయలుదేరి వెళతారు, మూడు రోజుల పాటు పులివెందులలో వైయ‌స్‌ జగన్‌ అందుబాటులో ఉంటారు.

Back to Top