వైయ‌స్ఆర్‌సీపీని వీడేది లేదు 

 ఎంపీ మేడా రఘునాథ్‌ రెడ్డి

తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్‌ రెడ్డి పార్టీ మారుతున్నారని కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఎంపీ రఘునాథ్‌ రెడ్డి స్పందిస్తూ..‘ఇదంతా తప్పుడు ప్రచారం. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. నేనే వైయ‌స్ఆర్‌సీపీని వీడేది లేదు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోనే పనిచేస్తాను. రాజకీయాల్లో ఉన్నంత వరకు వైయ‌స్‌ జగన్‌తోనే నా ప్రయాణం కొనసాగుతుంది. నాపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. ఫేక్‌ ప్రచారాన్ని ఎవరూ నమ్మకండి’ అంటూ వ్యాఖ్యలు చేశారు.

Back to Top