వైయ‌స్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియ‌ర్ నేత‌

శ్రీకాకుళం: టీడీపీ సీనియ‌ర్ నేత వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పుకున్నారు. `మేమంతా సిద్ధం` బ‌స్సు యాత్ర‌లో భాగంగా 22వ రోజు ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ సమక్షంలో పార్వతీపురం నియోజకవ‌ర్గానికి చెందిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మ‌హిళా క‌మిష‌న్ మాజీ స‌భ్యురాలు కొయ్యాన శ్రీ‌వాణి వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ మేర‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆమెకు వైయ‌స్ఆర్ సీపీ కండువా క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 

Back to Top