రషీద్‌ కుటుంబానికి అండగా ఉంటాం

మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ 

 అమరావతి:  రషీద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామ‌ని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాద‌వ్ పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ రెడ్‌ బుక్‌ పాలన కొనసాగుతోంద‌ని అనిల్  మండిప‌డ్డారు. లా అండ్‌ ఆర్డర్‌ కాదు నారా లోకేశ్‌ ఆర్డర్‌ కనిపిస్తోందని ఫైర్ అయ్యారు. వినుకొండ రషీద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో రషీద్‌ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్‌లో..‘రషీద్‌ హత్య ఘటన మనసున్న ప్రతీ ఒక్కరికీ కలచివేస్తోంది. అంత కిరాతమైన దృశ్యాలు ఆ వీడియో కనపిస్తున్నాయి. రషీద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

 

Back to Top