నెల్లూరులో యువగళం తొలిరోజే అట్టర్‌ ఫ్లాప్‌

లోకేష్‌ వాకింగ్‌కు వచ్చాడా..? ప్రజల సమస్యల పరిష్కారానికి వచ్చాడా..?

వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ప్రశ్న

నెల్లూరు: లోకేష్‌ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో తొలిరోజే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. పాదయాత్రలో లోకేష్‌ వెంట జనమే లేరన్నారు. ఎండకు తాళలేక మధ్యాహ్నం వరకు టెంట్‌లో పడుకుంటాడంట.. సాయంత్రం 4 గంటలకు బయటకొచ్చి సెల్ఫీలు దిగుతాడంట.. అసలు లోకేష్‌ వాకింగ్‌కు వచ్చినట్టా.. సమస్యల పరిష్కారానికి వచ్చినట్టా..? అని ప్రశ్నించారు. నెల్లూరులోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడారు. 

నెల్లూరు జిల్లాకు సంబంధించి దాదాపు 24 లక్షల మంది ఓటర్లు ఉన్నారని, లోకేష్‌కు అంత క్రేజ్, ప్రజాదరణ ఉంటే ఒక్క శాతం ఓటర్లు అయినా పాదయాత్రలో పాల్గొని ఉండాలి కదా అని మంత్రి కాకాణి ప్రశ్నించారు. నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు కనీసం 2 వేలమంది జనాన్ని కూడా సమీకరించలేకపోయారన్నారు. లోకేష్‌కు వీడ్కోలు పలకడానికి వచ్చిన జనం, నెల్లూరు జిల్లాకు స్వాగతం పలకడానికి వచ్చిన జనాన్ని మొత్తం కలిపినా కూడా 3 వేల మందికి మించి ఉండరన్నారు. దీన్ని బట్టి యువగళం నెల్లూరుకు వచ్చే సరికి మూగబోయిందన్నారు. లోకేష్‌ నుంచి పెద్దగా ఆశించాల్సిన అవసరం కూడా ఎవరికీ లేదని, ఎందుకంటే మాట్లాడలేడు, మాట్లాడితే ఏం మాట్లాడితే అర్థం కాని పరిస్థితి.. లోకేష్‌కు అసలు సబ్జెక్టే లేదని క్యాడర్‌కు అర్థమైందని మంత్రి కాకాణి ఎద్దేవా చేశారు. విషయం లేని వ్యక్తి గురించి పెద్దగా మాట్లాడటం కూడా మంచిది కాదని చురకలంటించారు.  
 

Back to Top