ఇదేనా ప్రజా వైద్యం తీరు

వైయ‌స్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు 

గుర్ల మండలంలోని డయేరియా వైద్య శిబిరంలో సౌకర్యాలు లేవు

చంద్రబాబు సారా మత్తు నుంచి బయటకు రండి

విజయనగరం :  గుర్ల మండలంలో డయేరియా పంజా విసురుతోంది. గోషాడ, కెల్ల, కోటగండ్రేడు, పెనుబర్తిల్లో 450 మందికిపైగా డయేరియా బారినపడ్డారు. ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడ్డారు. రోగుల‌కు స‌రైన వైద్యం అంద‌డం లేద‌ని ..ఇదేనా ప్ర‌జా వైద్యం తీరు అని వైయ‌స్ఆర్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర అధ్య‌క్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్ప‌ల‌రాజు మండిప‌డ్డారు. గుర్ల మండలంలోని డయేరియా వైద్య శిబిరంలో సౌకర్యాలు లేవని మాజీ మంత్రి అన్నారు. ⁠దేశం ఉలిక్కిపడిన సంఘటన ఇదని  తెలిపారు. ఆయన శనివారం గుర్లలో డయేరియా వైద్య శిబిరంలో రోగులను పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.

‘‘నాలుగు రోజులుగా వైద్య శిబిరం నడుస్తోంది. ప్రభుత్వం అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. దయనీయమైన పరిస్థితి వుంది. ⁠బెంచీలు, కుర్చీలు మీద పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ⁠తాము విద్యా , వైద్యం మెరుగుపరిచి చంద్రబాబు ప్రభుత్వానికి అప్పగించాం. వైయ‌స్ జగన్ స్కూల్‌లో బెంచీలు, కుర్చీలు సమకూర్చపోయి ఉంటే.. నేల మీద పడుకోబెడతారా? పీహెచ్‌సీల నుంచి బెడ్స్ సేకరించి వైద్య శిబిరంలో ఎందుకు ఏర్పాటు చేయలేదు? సీఎం చంద్రబాబు సారా మత్తు నుంచి బయటకు రండి. ఇసుకమత్తు నుంచి బయటకు రండి అంటూ సూచించారు.

ఈ రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు వున్నాయో చూడండి.  ఇదేనా ప్రజా వైద్యం తీరు. వైద్యం హక్కుగా ఉన్న స్థితి నుంచి ఆడుకున్నే స్థితికి తీసుకువచ్చారు. ఈ దుర్భర పరిస్థితులను నేషనల్ మీడియా చూస్తే రాష్ట్ర పరువు పోతుంది. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, మంత్రి వచ్చి చూసి వెళ్లి.. ఏం చర్యలు తీసుకున్నారు?’’ అని అన్నారు.

 

Back to Top