అల్లూరి జిల్లా: గిరిజన హక్కులకు భంగం కలిగేలా మాట్లాడిన స్పీకర్ అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే విశ్వేశ్వర రాజు డిమాండ్ చేశారు. స్పీకర్ వ్యాఖ్యలకు నిరసగా గిరిజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. వీరికి వైయస్ఆర్సీపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. నిరసనలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు పాల్గొని స్పీకర్ తీరును ఎండగట్టారు. 1/70 యాక్ట్ను సవరించాలన్న అయ్యన్న వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండు రోజుల పాటు మన్యం బంద్ గిరిజన హక్కులు, చట్టాలను గౌరవించాల్సిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇటీవల విశాఖలో జరిగిన పర్యాటక సదస్సులో 1/70 చట్టాన్ని సవరింలంటూ చెప్పడంపై రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు ఆగ్రహం వ్యక్తంచేశారు. అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్తో పలు రాజకీయ పార్టీలు, గిరిజన సంఘాలు మన్యం బంద్ చేపట్టాయి. ఇవాళ ఉదయం నుంచే వ్యాపార, వాణిజ్య సముదాయాలను మూసివేశారు. 1/70 యాక్ట్ను సవరిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గిరిజన సంఘాలు హెచ్చరించాయి. టూరిజం ముసుగులో గిరిజన భూములను కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని గిరిజనులను దోపిడీ చేసే కుట్ర జరుగుతుందని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యన్న పాత్రుడు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని.. క్షమాపణ చెప్పాలని గిరిజన సంఘాల నేతలు డిమాండ్ చేశాయి. స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడుపై చర్యలు తీసుకోవాలని గిరిజన సంఘాల అఖిల పక్షం నేడు(మంగళ), రేపు( బుధవారం) మన్యం బంద్ నిర్వహించాలని నిర్ణయించాయి. ఈ బంద్కు వైయస్ఆర్సీపీ మద్దతు తెలిపింది.