సీతారాం ఏచూరి మ‌ర‌ణం గొంతు లేని ప్ర‌జ‌ల‌కు తీర‌ని లోటు

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి

వైయ‌స్ఆర్‌సీపీ త‌ర‌ఫున ఏచూరి భౌతిక‌కాయానికి నివాళులు

న్యూఢిల్లీ:  సీపీఎం జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరి మ‌ర‌ణం సీపీఎంకే కాదు, దేశానికి, ముఖ్యంగా పేద, అణగారిన, అట్టడుగు, గొంతు లేని ప్రజలకు తీరని లోటు అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యులు వి.విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు. అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో తుదిశ్వాస విడిచిన వామప‌క్ష దిగ్గజం సీతారాం ఏచూరి భౌతిక‌కాయానికి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌ర‌ఫున ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నివాళుల‌ర్పించారు.  ఏచూరి కుటుంబ స‌భ్యుల‌ను, సీపీఎం పార్టీ నాయ‌కుల‌ను ప‌రామ‌ర్శించి, ఓదార్చారు. నిజమైన లౌకిక, అంకితభావం మరియు నిబద్ధత కలిగిన నాయకుడు సీతారాం ఏచూరి మరణం సీపీఎంకే కాదు, దేశానికి, ముఖ్యంగా పేద, అణగారిన, అట్టడుగు, గొంతు లేని ప్రజలకు తీరని లోటు అంటూ విజ‌య‌సాయిరెడ్డి కొనియాడారు. 

Back to Top