అమరావతి: తొలి ప్రపంచ ఖోఖో చాంపియన్షిప్ ఫైనల్స్లో డబుల్ గోల్స్ సాధించి విజేతలుగా నిలిచిన భారత పురుషులు, మహిళల జట్లను వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. భవిష్యత్లో జరిగే టోర్నీల్లో భారత జట్లు మరిన్ని విజయాలు సాధించాలని ఆయన ఆకాంక్షించారు.