జీజీహెచ్‌లో యువ‌తిని పరామ‌ర్శించిన వైయ‌స్ఆర్‌సీపీ నేత‌లు

 
గుంటూరు:  టీడీపీ రౌడీ షీటర్‌ చేతిలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ తో గుంటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న యువ‌తిని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కులు పరామ‌ర్శించారు. వైయ‌స్ఆర్‌సీపీ గుంటూరు పార్ల‌మెంట్ స‌మ‌న్వ‌య‌క‌ర్త మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, త‌దిత‌రులు ఆసుప‌త్రికి వెళ్లి బాధితురాలి ఆరోగ్య‌ప‌రిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ స‌భ్యులు, వైద్యుల‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందించి అమ్మాయిని బ‌తికించాల‌ని కోరారు.  ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్న‌ట్లు బంధువులు తెలిపారు. 
అధికార టీడీపీకి చెందిన నేత, రౌడీషీటర్ నవీన్ చేతిలో గాయపడి బ్రెయిన్ డెడ్ అయి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మధిర సహాన ఆరోగ్యం విషమంగా మారింది. వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఆమె బాడీపై కమిలిన గాయాలు ఉండటం గమనార్హం. ఈ నేపథ్యంలో బాధితురాలిని హింసించి అత్యాచారం చేసినట్టు తెలుస్తోంది.

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మధిర సహాన ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. ఈ తరుణంలో శనివారం సాయంత్రం కొల్లిపర మండలం వల్లభాపురానికి చెందిన టీడీపీ నేత,రౌడీ షీటర్‌ నవీన్.. మధిర సహానను కారులో తీసుకెళ్లాడు. అనంతరం కొన్ని గంటల తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లిన సహానను ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. బాధితురాలి తల్లిదండ్రులకు సమాచారం అందించాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు.

కుమార్తె ఆస్పత్రిలో ఉందనే సమాచారం కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. అప్పటికే బ్రెయిన్‌ డెడ్‌ అయ్యి ఉన్న కుమార్తెను బతికించుకునేందుకు శత విధాలా ప్రయత్నిస్తున్నారు. నాలుగు ఆస్పత్రులు తిరిగినా లాభం లేకపోవడంతో గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలికి చికిత్స అందిస్తుండగా.. వెంటిలేటర్‌ తీస్తే ప్రాణాలు పోతుందని వైద్యులు చెప్పారు. దీంతో ఏం చేయాలో పాలుపోక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. 

రేపు  వైయ‌స్ జ‌గ‌న్ ప‌రామ‌ర్శ  
వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ ఈ నెల 23న (బుధ­వారం) గుంటూరు, వైయ‌స్ఆర్‌ జిల్లాల్లో పర్య­టిం­చనున్నారు. అఘాయిత్యానికి, హత్యాచా­రా­నికి గురైన ఆడపిల్లల కుటుంబాలను పరామర్శించనున్నారు. టీడీపీ కార్యకర్త, రౌడీ షీటర్‌ దుర్మార్గం కారణంగా అపస్మారక స్థితి­లోకి వెళ్లిన తెనాలికి చెందిన యువతిని బుధ­వారం ఉదయం వైయ‌స్‌ జగన్‌ పరామర్శించనున్నారు. 

Back to Top