బాబు పాలనలో అన్నింటికీ సమాధానం ఈ ఫొటోనే 

ట్విట్ట‌ర్‌లో ఫొటో షేర్‌ చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి
 

ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రులను ఓ ఐఏఎస్‌ అధికారి శాసిస్తున్నారని వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డిఅన్నారు  . ఈ క్రమంలో నలుగురు మంత్రుల ఎదుట సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్‌పీ సిసోడియా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఫొటోను ఆయన షేర్‌ చేశారు.

కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా సిసోడియా, మంత్రుల ఫొటోను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే జరుగుతోంది. బాబు పాలన అంటే ఇలాగే ఉంటుంది. మంత్రుల ముందు ఐఏఎస్‌ అధికారి కాలు మీద కాలువేసుకుని రాజులా కూర్చున్నాడు. మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, అనగాని సత్య ప్రసాద్ జూనియర్ ఆఫీసర్లలా ఆయన ముందు కూర్చున్నారు. బాబు పాలనలో అన్నింటికీ సమాధానం ఈ ఫొటోనే చెబుతుంది’ అని కామెంట్స్‌ చేశారు.

 

Back to Top