అబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట

ఎన్నిక‌ల ప్ర‌చారంలో విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్థి దేవినేని అవినాష్ 

విజ‌య‌వాడ‌: అబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట అని విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే అభ్య‌ర్థి దేవినేని అవినాష్ విమ‌ర్శించారు. విజ‌య‌వాడ న‌గ‌రంలో శుక్ర‌వారం దేవినేని అవినాష్ ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హించారు.

దేవినేని అవినాష్ ఏమ‌న్నారంటే..

  • 18వ డివిజన్‌లో డ్రైనేజీ, రోడ్లు పనులను నిర్లక్ష్యం చేసిన టీడీపీ ప్రభుత్వం
  • టీడీపీ నిర్లక్ష్యం చేసిన ప్రాంతాన్ని 18కోట్లతో మౌలిక సదుపాయాల కల్పించాం
  • డివిజన్ లో కమ్యూనిటీ హాల్, నిర్మాణం సైతం పూర్తి చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది 
  • నాడు నేడు ద్వారా స్థానిక ఎలిమెంటరీ స్కూల్‌ను హై స్కూల్‌గా మార్చము
  • అర్హత ప్రామాణికంగా ప్రతీ ఒక్కరికి  పథకాలు అందించాం
  • ఈ ప్రాంతంలో ఓటు అడిగే హక్కు టీడీపీ నేతలకి లేదు
  • స్థానిక టీడీపీ ఎమ్మెల్యే ప్రచారం చేసే ప్రతీ రోడ్డు జగన్ ప్రభుత్వమే నిర్మించింది
  • టీడీపీ నేతలకు అనుభవం కాదు ఆచరణ, అభివృద్ధి ఎక్కడ ?
  • టీడీపీ నేతల అవమానం సహించలేక జనసైనికులు వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నారు
  • నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయని గద్దె ప్రజలకు క్షమాపణ చెప్పాలి 
  • అబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
  • రీటైనింగ్ వాల్ నిర్మాణంపై టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా?.
  • రానున్న ఎన్నికల్లో టీడీపీ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు 
  • టీడీపీ నేతల కాల్ మనీ వేధింపులు భరించలేక మహిళ పోలీసులను ఆశ్రయించింది నిజం కాదా
  • మాకు వద్దు ఈ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అని ప్రజలు అంటున్నారు
Back to Top