శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి 

రాష్ట్ర ప్రజలకు సీఎం వైయ‌స్ జగన్ శ్రీరామ నవమి శుభాకాంక్షలు
 

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు..

తెలుగువారి తొలి పండుగ  ఉగాది తరువాత వచ్చే మరో  విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా జరుపుకుంటారు. దేశవ్యాప్తంగా కూడా  శ్రీరామ నవమి వేడుకను  ఎంతో ఘనంగా జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో రాముణ్ని పూజిస్తారు. సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకాన్ని  వైభవంగా జరిపిస్తారు.  ఏప్రిల్‌ 17వ తేదీ(బుధవారం) శ్రీరామనవమి పండుగ వచ్చిన సంగతి తెలిసిందే.

Back to Top