నేడు పులివెందుల పర్యటనకు వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఇవాళ వైయ‌స్ఆర్ జిల్లా పులివెందుల పర్యటనకు వెళ్ళనున్నారు. శ‌నివారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కడప ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని అక్కడినుంచి రోడ్డు మార్గంలో పులివెందుల బయలుదేరి వెళతారు. మూడు రోజుల పాటు ఆయన పులివెందులలోనే ఉంటారు. జులై 8న వైయ‌స్ఆర్‌ జయంతి వేడుకల్లో పాల్గొంటారు.

Back to Top