తాడేపల్లి: వరదలు వస్తాయని తెలిసినా అలర్ట్ చేయకుండా విజయవాడ ప్రజల ప్రాణాలను బలిగొన్న కూటమి ప్రభుత్వంపై వైయస్ఆర్సీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇదే సమయంలో బాధ్యత లేకుండా మాట్లాడుతున్న మంత్రి నారా లోకేష్ కామెంట్స్పై చురకలంటించింది. రెడ్బుక్ అంటే పాలన చేసే నువ్వా.. వైయస్ జగన్ గురించి మాట్లాడేది అంటూ పలు ప్రశ్నలు సంధించింది. కాగా, వైయస్ఆర్సీపీ ట్విట్టర్ వేదికగా..‘లోకేష్.. నీకు సిగ్గుందా? నిన్న కూడా హైదరాబాద్ వెళ్లి.. పొద్దుట స్పెషల్ ఫ్లైట్లో వచ్చావ్. నీకు ప్రజల గురించి పట్టింపు ఉందా?. హుందాతనం గురించి నువ్వు మాట్లాడితే.. ఆ పదమే సిగ్గుపడుతుంది. రాజకీయాల్లో బజారు భాషని ప్రవేశపెట్టి, రెడ్బుక్ అంటూ ఒక ఎర్రిబుక్కు పట్టుకుని పిచ్చి పాలన చేస్తున్న నువ్వు వైయస్ జగన్మోహన్ రెడ్డిని నిందించడం విడ్డూరంగా ఉంది. లక్షల మంది ప్రజలను వరదలకు వదిలేసి, పదుల కొద్దీ ప్రజల ప్రాణాలు తీసిన మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించకూడదన్న అహంకారాన్ని ముందు విడిచిపెట్టు.