నకిలీ గురించి నువ్వు మాట్లాడితే ఎలా చంద్రబాబూ!

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆగ్ర‌హం

తాడేప‌ల్లి:  : ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత‌ ప్రజాస్వామ్య ప్రభుత్వం స్థానంలో ముఠాల పాలన కనిపిస్తోంది.. ఈ రెండు నెలల కాలంలో ఏపీ అంటేనే రాజకీయ హింసకు మారుపేరుగా మారిపోయింది. పరిస్థితిలో ఏమాత్రం మార్పు రావడంలేదు. ప్రభుత్వంలో పెద్దల ప్రోత్సాహంతో జరిగే ఘటనలు, అధికారంలో తమపార్టీ ఉందనే ధీమాతో చేస్తున్న దాడులు, రాజకీయ ప్రేరేపిత దుశ్చర్యలు రాష్ట్రంలో ప్రతిరోజూ జరుగుతూనే ఉన్నాయి. నంద్యాల జిల్లాలో నిన్న రాత్రి జరిగిన హత్య, ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన దాడి ఘటన వీటికి నిదర్శనాలే.
ప్రజలకిచ్చిన హామీలను చంద్రబాబు నిలబెట్టుకోలేకపోవడంతో, ఎవరూ ప్రశ్నించకూడదని, రోడ్డుపైకి రాకూడదని ప్రజలను, వైయ‌స్ఆర్‌ సీపీ నాయకులు, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడానికి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారు.  ఇన్ని జ‌రుగుతున్నా చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి చీమ కుట్టిన‌ట్లు కూడా లేదు. ఇంత‌టి ఘోర‌మైన పాల‌న అందిస్తున్న చంద్ర‌బాబు న‌కిలీ గురించి మాట్లాడుతుంటే ప్ర‌జ‌లు న‌వ్వుకుంటున్నారంటూ వైయ‌స్ఆర్‌సీపీ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసిన‌ ఓ వీడియో వైర‌ల్‌గా మారింది. 

https://x.com/YSRCParty/status/1820364095692079163?t=i-ygfbHaTufRMHi3iUd...

నువ్వు వచ్చాక….
రాష్ట్రంలో ప్రభుత్వం ఫేక్‌.
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఫేక్‌.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ఫేక్‌.
రాష్ట్రంలో శాంతి భద్రతలు ఫేక్‌.
రాష్ట్రంలో చట్టం ఫేక్‌.
చివరకు నీ రాజకీయాలు ఫేక్‌.
నువ్వు ఇచ్చిన హామీలు ఫేక్‌.
రోజూ నువ్వు చెప్పే మాటలు ఫేక్‌
చివరకు సీఎంగా నువ్వే ఫేక్‌.
ఫేక్‌ న్యూస్‌ ఫ్యాక్టరీలకు షాడో యజమానివి.
నకిలీ గురించి నువ్వు మాట్లాడితే ఎలా చంద్రబాబూ!
ఆ వీడియో చూస్తేనే అర్థం అవుతుంది.. ఎవరు ఫేకో.

Back to Top