పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపిక కావ‌డం గ‌ర్వంగా ఉంది

జ్యోతి యారాజీ, జ్యోతిక‌ల‌కు వైయ‌స్ జ‌గ‌న్ అభినంద‌న‌లు

తాడేప‌ల్లి:  ఆంధ‌ప్ర‌దేశ్ రాష్ట్రానికి చెందిన‌ అథ్లెట్‌ జ్యోతి యారాజీ, జ్యోతిక శ్రీ‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు ఎంపిక‌కావ‌డం గ‌ర్వంగా ఉంద‌ని మాజీ ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు ఎంపికైన ఈ ఇద్ద‌రిని వైయ‌స్ జ‌గ‌న్ అభినందిస్తూ ట్వీట్ చేశారు.  జ్యోతియారాజీ, డి. జ్యోతిక శ్రీ 2024 పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీ కృషి, అంకితభావం ఆంధ్రప్రదేశ్‌కు ఎనలేని గర్వాన్ని తెచ్చిపెట్టాయి. మ‌న దేశ కీర్తి కోసం మీరు చేస్తున్న కృషి అభినంద‌నీయ‌మ‌ని,  మీ ఇద్దరికీ   మంచి జరగాలని కోరుకుంటున్నా అంటూ వైయ‌స్ జ‌గ‌న్ ట్వీట్ చేశారు.

Back to Top