అసెంబ్లీ: పత్రికా స్వేచ్ఛకు భంగం కలుగుతుందని శాసనసభలో రాద్ధాంతం చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి విశ్వరూప్ అన్నారు. ఎంఏ ఇంగ్లిష్ శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీలో చదివిన చంద్రబాబుకు జీవో 2430 సారాంశం ఏం అర్థమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. అవాస్తవాలు ప్రచురిస్తున్నారని జీవో తీసుకువస్తే.. ఆ జీవోలో అభ్యంతరకంగా ఏముందో మాట్లాడకుండా చంద్రబాబు లేచి తెల్లకాగితం తీసుకుని మిగిలిన విషయాలు మాట్లాడుతున్నారన్నారు. ఆ జీవోలో ఏం అర్థమైందో చెప్పాలన్నారు. ప్రజా సమస్యలు చర్చకు రాకుండా ప్రతిపక్షం సభా సమయాన్ని వృథా చేస్తుందన్నారు.