రాష్ట్రం అత్యాచారాంధ్రప్రదేశ్ గా మారిపోయింది

మాజీ మంత్రి ఆర్కే రోజా

గర్భశోకం మీ చెవులకు వినిపిస్తోందా? అంటూ వీడియో పోస్టు

చిత్తూరు: రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని వైయ‌స్ఆర్‌సీపీ నాయ‌కురాలు, మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాష్ట్రం అత్యాచారాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారింద‌ని ధ్వ‌జ‌మెత్తారు.  వైయ‌స్ఆర్ జిల్లా బద్వేలులో ఇంటర్ విద్యార్థినిపై మాజీ ప్రియుడు పెట్రోల్ పోసి నిప్పంటించగా, ఆ విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటనపై రోజా తీవ్రస్థాయిలో స్పందించారు. 

రాష్ట్రంలో ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం వరుస అత్యాచారాలు, హత్యలతో ఆంధ్రప్రదేశ్ ను 'అత్యాచారాంధ్రప్రదేశ్'గా మార్చేసిందని విమర్శించారు. 
వైయ‌స్ఆర్‌ జిల్లాలో ప్రేమోన్మాది దాడిలో ఆడబిడ్డ కన్నుమూసిందని పేర్కొంటూ... మృతురాలి తల్లి భోరున విలపిస్తున్న వీడియోను రోజా సోషల్ మీడియాలో పంచుకున్నారు. రోదిస్తున్న ఆ కన్నతల్లి గర్భశోకం మీ చెవులకు వినిపిస్తోందా? అంటూ చంద్రబాబు, హోంమంత్రి అనిత, పవన్ కల్యాణ్ లను ప్రశ్నించారు.

Back to Top