కాసేప‌ట్లో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైయ‌స్‌ జగన్‌ భేటీ 

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌ జిల్లా ప్రొద్దు­టూ­రు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపా­లిటీ­లు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ వైయ‌స్ఆర్‌సీపీ స్థానిక సంస్థల ప్రజా­ప్రతి­నిధులతో వైయ‌స్ఆర్‌సీపీ అధ్య­క్షుడు, మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) కాసేప‌ట్లో సమావేశం కానున్నారు. 

స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాల్లో భాగంగా తాడేపల్లి­లోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సమావేశం జరుగనుంది. దీనికి ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వా­నించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు.      

Back to Top