గుంటూరు: చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావ్. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది.. ఇదే జైల్లో ఉంటారని వైయస్ఆర్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు రెడ్బుక్ పెట్టుకోవడం ఏదో ఘనకార్యం కాదు. పాలన గాలికొదిలేసి రెడ్బుక్పైనే బాబు దృష్టి పెట్టాడని వైయస్ జగన్ దుయ్యబట్టారు. ఇంత దుర్మార్గ పాలన ఏపీలో ఎన్నడూ లేదని మండిపడ్డారు. అక్రమ కేసులో అరెస్టై గుంటూరు సబ్జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేష్ను వైఎస్ జగన్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం వైయస్ జగన్ మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు నిర్లక్ష్యంతో విజయవాడ అతలాకుతలం అయ్యింది. బాబు తప్పిదాలను డైవర్ట్ చేసేందుకే అక్రమ కేసులు. నాలుగేళ్ల క్రితం నాటి కేసును తెరపైకి తెచ్చారు. సిట్టింగ్ సీఎంను టీడీపీ నేత దారుణంగా బోసుడీకే అని దూషించాడు. సీఎంగా నన్ను దూషించినా బాబులా కక్ష సాధింపునకు దిగలేదు. 41 ఏ కింద నోటీసులు ఇచ్చి కోర్టులో ప్రవేశపెట్టామని అని వైయస్ జగన్ గుర్తు చేశారు. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు నాడు జరిగిన ఘటనలో నందిగం సురేష్ ఉన్నాడా?. సీసీ ఫుటేజ్లో ఎక్కడైనా నందిగం సురేష్ కనబడ్డాడా?. అక్రమ కేసులతో ఒక దళిత నేతను అరెస్ట్ చేశారు. చంద్రబాబు తప్పుడు సాంప్రదాయానికి నాంది పలుకుతున్నావ్. మీ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. ఇదే తప్పుడు సాంప్రదాయం ఒక సునామీ అవుతుంది. మీ నాయకులకు ఇదే గతి పడుతుంది.. ఇదే జైల్లో ఉంటారు. రెడ్బుక్ పెట్టుకోవడం ఏదో ఘనకార్యం కాదు. పాలన గాలికొదిలేసి రెడ్బుక్పైనే బాబు దృష్టి పెట్టాడు. తన ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను ముంచాడు తుపాను వస్తుందని ముందే చెప్పినా బాబు పట్టించుకోలేదు. తన ఇంటిని రక్షించుకునేందుకు విజయవాడను ముంచారు. బుడమేరు గేట్లు ఎత్తి విజయవాడను ముంచేశారు. చంద్రబాబు తప్పుడు పనికి 60 మందికిపైగా చనిపోయారు. 60 మందిని పొట్టను పెట్టుకున్న బాబుపై కేసు ఎందుకు పెట్టరు?. చంద్రబాబు బోట్ల రాజకీయం చేస్తున్నారు. బోట్లకు ఎవరి హయాంలో పర్మిషన్ వచ్చింది?. చంద్రబాబు గెలవగానే ఇదే బోట్లపై విజయోత్సవాలు చేశారు. బాబు, లోకేష్తో కలిసి బోటు ఓనర్ ఉషాద్రి ఫొటోలు దిగాడు. టీడీపీ హయాంలోనే ఈ బోట్లకు అనుమతి ఇచ్చారు. ఈ బోట్లన్నీ టీడీపీ నేతలకు చెందినవే. వాస్తవాలు వక్రీకరించి రాజకీయం చేస్తున్నారు. ప్రజలకు తోడుగా నిలవకుండా నేరాన్ని మాపై నెడుతున్నారు. సూపర్ సిక్స్ హామీలేవి? ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలు అంటూ ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక వాటి ఊసే లేదు. ప్రజలు బాబు నైజం గుర్తు చేసుకొని ఇప్పడు మోసపోయామని బాధపడుతున్నారు. రాష్ట్రంలో పాలన ఉందా?. సచివాలయ వ్యవస్థను నీర్వీర్యం చేశారు. ఇంటింటికి సేవలను నిలిపేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి సాయం లేదు. అమ్మఒడి పథకాన్ని గాలికొదిలేశారు. బడుల్లో తిండి తినలేక విద్యార్థులు ధర్నాలు చేస్తున్నారు. ఆసుపత్రుల్లో మందులు, నర్సుల కొరత ఉంది. మెడికల్ కాలేజీలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలని వైయస్ జగన్ డిమాండ్ చేశారు.