శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలి

తెలుగు ప్ర‌జ‌ల‌కు వైయ‌స్‌ జగన్‌ తొలి ఏకాదశి శుభాకాంక్షలు
 

తాడేపల్లి: శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని మాజీ ముఖ్య‌మంత్రి, వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కోరారు. తొలి ఏకాదశి సందర్భంగా ప్రజలకు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.
‘‘పవిత్రమైన తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ  తెలుగువారందరికీ శుభాకాంక్షలు’’ అంటూ వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డి  ట్వీట్‌ చేశారు.

Back to Top