హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీక

మొహర్రం సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సందేశం

తాడేప‌ల్లి: మహ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీక అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. మొహర్రం సందర్భంగా వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఓ ప్ర‌క‌ట‌న‌లో సందేశం తెలిపారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం.. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు ప్రతీక  అన్నారు. మహ్మద్‌ ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ బలిదానానికి మొహర్రం ప్రతీక అని పేర్కొన్నారు. ఇస్లామిక్‌ క్యాలెండర్లో మొదటి నెల కూడా మొహర్రం అని చెప్పారు. ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సామరస్యానికి, సమైక్యతకు ప్రతిబింబంలా నిలుస్తాయని యస్‌ జగన్‌ తన సందేశంలో పేర్కొన్నారు. 

Back to Top