కాకినాడ: ఇసుక విషయంలో తనపై చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యానానికి సిద్ధంగా ఉన్నానని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మార్గాని భరత్ చంద్రబాబుకు సవాలు విసిరారు. వైయస్ జగన్ మోహన్ రెడ్డి అద్భుతంగా పరిపాలన చేస్తుంటే జీర్ణించుకోలేక చంద్రబాబు బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నారని, ఆయన మాటలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు. రాజమండ్రిలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. గోదావరి నదీ తీరంలో ఉన్న ఇసుకను తరలించానని తనపై టీడీపీ ఆరోపణలు చేయడం సిగ్గు చేటు అన్నారు. నేను ఇసుక నుంచి ఒక్క రూపాయి సంపాదించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని పేర్కొన్నారు. బలహీన వర్గాలకు చెందిన ఒక యువకుడిని ఎంపీగా ఎన్నికైతే..నాపై ఇలాంటి ఆరోపణలు చేయడం దుర్మార్గమన్నారు. గతంలో టీడీపీకి చెందిన మురళిమోహన్, ఆయన బంధువులు ఇసుక నుంచి వందల కోట్లు దోచారని, ఇందులో చంద్రబాబుకు కూడా షేర్ ఉందన్నారు. పెందుర్తి వెంకటేశ్వర్లు కూడా ఇసుక పేరుతో దోచుకున్నారని విమర్శించారు. నాపై బురద చల్లచడం సిగ్గుచేటు అన్నారు. ప్రజలు ఎవరూ కూడా టీడీపీ నేతలను నమ్మే పరిస్థితి లేదన్నారు. 23 సీట్లు ఇచ్చారంటే రాష్ట్ర ప్రజలు ఏరకంగా తిరస్కరించారో జ్ఞానోదయం చేసుకోవాలన్నారు. సుమారు 800 ఎకరాలల్లో ఇసుక తవ్వకాలు చేసి టీడీపీ నేతలు ఎలా దోచుకున్నారో అందరికి తెలుసు అన్నారు. నాపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలు రుజువు చేస్తే రాజకీయ సన్యాసం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ప్రచారం కోసం చంద్రబాబు వందల కోట్లు ఖర్చు చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశారన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాధనాన్ని ఆదా చేస్తూ సంక్షేమ పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నారని, సుపరిపాలనను చూసి ఓర్వలేక చంద్రబాబు దొంగ దీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. Read Also: చదువులు బాగా చదవాలి...గొప్పగా ఎదగాలి