నా మాటలను తప్పుదారి పట్టించవద్దు

‘అర్థం కాకపోతే మళ్ళీ వినండి’.. లోకేష్‌పై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
 

తాడేపల్లి: ‘‘నేను మీడియా ప్రతినిధులను ఎన్నడూ దూషించలేదు. మీడియా ముసుగులో మీరు పెంచి పోషిస్తున్న కుల అరాచక శక్తులు గురించి మాత్రమే మాట్లాడాను. నా మాటలను తప్పుదారి పట్టించవద్దు.. అర్థం కాకపోతే నా ప్రెస్ మీట్ మళ్ళీ వినండి’’ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా  మంత్రి నారా లోకేష్‌పై మండిపడ్డారు.

‘‘మంచి, మర్యాద గురించి ఎవరికైనా అవసరమైతే నేను నేర్పిస్తాను. మీ భాష ఏమిటో మీకు తెలియాలంటే గత ఇరవై నెలల మీ వీడియోలు మీరే చూసుకోండి. పెద్దల సభ సభ్యుడితో మాట్లాడే తీరు ఇదేనా?’’ అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Back to Top