రేపు నెల్లూరులో వైయ‌స్ జ‌గ‌న్ ప‌ర్య‌ట‌న‌

తాడేప‌ల్లి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి రేపు నెల్లూరులో ప‌ర్య‌టించ‌నున్నారు. గురువారం ఉదయం 9.40గంటలకు హెలికాప్ట‌ర్‌లో తాడేపల్లి నుంచి బయల్దేరి 10.30 గంటలకు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గాన బ‌య‌ల్దేరి నెల్లూరు సెంట్రల్ జైలు చేరుకుని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కలిసిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకుని హెలికాప్ట‌ర్‌లో తాడేపల్లికి చేరుకుంటారు. 

Back to Top