వైయ‌స్ఆర్‌ విగ్రహం ఏర్పాటు చేయాలి

అమ‌రావ‌తి: విజయవాడ నగరంలోని కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌​ వద్ద దివంగత ముఖ్యమంత్రి వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయాల‌ని వైయ‌స్ఆర్‌ విగ్రహ పునఃప్రతిష్ట కమిటీ ఆందోళన చేపట్టింది. తెలుగుదేశం ప్రభుత్వం కంట్రోల్‌ రూమ్‌ జంక్షన్‌ వద్ద ట్రాఫిక్‌ క్రమబద్దీకరణ పేరుతో వైయ‌స్ఆర్‌ విగ్రహాన్ని తొలగించారని కమిటీ సభ్యులు ఆరోపించారు. మహానేత విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని కోరుతూ శనివారం ఫైర్‌ స్టేషన్‌ ప్రాంగణంలో ధర్నా నిర్వహించి.. అక్కడున్న వైయ‌స్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.  
 

Back to Top